జడ్చర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ 27స్థానాలు గెలుస్తుంది
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, ఏప్రిల్ 23: పనిచేసే పార్టీలకే ప్రజలు పట్టం కడుతారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 10వ వార్డులోని బాలాజీనగర్, కుమ్మరివాడ, 11వ వార్డులోని మారుతీనగర్, బాబానగర్, 23వ వార్డులోని బంగారుమైసమ్మ ఆలయ ప్రాంతం, చైతన్యనగర్ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి అహర్నిషలు కృషిచేస్తున్నారన్నారు. గతంలో జడ్చర్ల ఎంతో వెనుకబడిందని, అప్పటి నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 70ఏండ్లలో చేయలేని అభివృద్ది ఏడేండ్లలో చేసినట్లు తెలిపారు. పట్టణం అభివృద్ధి జరగాలంటే ప్రజలంతా టీఆర్ఎస్కు మద్దతు తెలిపి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జిల్లాలోనే జడ్చర్లను మోడల్ పట్టణంగా తీర్చి దిద్దుదామన్నారు. మున్సిపాలిటీలోని 27స్థానాలకు 27 టీఆర్ఎస్ గెలుచుకొని గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. అంతకుముందు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ప్రచారంలో సంగీత, నాటక అకాడమీ రాష్ట్ర చైర్మన్ బాద్మి శివకుమార్, 10వార్డు అభ్యర్థి నడిమింటి రమేశ్, 11వార్డు అభ్యర్థి బీ జ్యోతి, 23వ వార్డు అభ్యర్థి ఉమాశంకర్గౌడ్, ఊళ్లబాయి యాదిరెడ్డి, జగదీశ్వరాచారి, బీకేఆర్, శేఖర్రెడ్డి, నవాబ్పేట జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, అందెబాబన్న, నర్సింహులు, సర్పంచ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.