‘మిషన్ కాకతీయ’తో మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి. చెరువులు, కుంటల పునరుద్ధరణ జరిగి నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. చేపల ఉత్పత్తిని పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఏటేటా ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నది. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలోని 650 చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేయగా, మత్స్యకారుల ఇంట సిరులు కురువనున్నాయి. ప్రస్తుతం రెండు నుంచి 7 కేజీల వరకు చేపలు ఎదిగాయని, చేతినిండా పని దొరుకుతుందని గంగపుత్రులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది దాదాపుగా 4వేల నుంచి 5 వేల టన్నుల వరకు చేపల దిగుబడి రానున్నదని, రూ.32 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.
రంగారెడ్డి, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది. ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ చేయూతనిస్తున్నది. చేపల పెంపకంతో మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో జిల్లాలోని వందలాది జలాశయాల్లో పూడికలు తీయించి చెరువులు, కుంటలను పునరుద్ధరించారు. కబ్జాలకు గురైన పలు చెరువులను సంరక్షించి వాటి విస్తీర్ణాన్ని పెంచారు. తద్వారా జిల్లాలో చెరువులు, కుంట లు, బావులు, పలు జలాశయాల్లో భారీగా నీటి సామ ర్థ్యం పెరిగి నిండుకుండల్లా మారాయి. జిల్లాలోని 794చెరువుల్లో జలకళ సంతరించుకున్నది.
‘మిషన్ కాకతీయ’తో మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి. చేపల పెంపకానికి అనుకూలమైన 650 చెరువుల్లో వంద శాతం సబ్సిడీతో ప్రభు త్వం కోట్లాది చేప పిల్లలను వదిలింది. దీంతో జిల్లాలో ఉన్న 150 మత్స్యకార సొసైటీల సభ్యులు లబ్ధి పొందుతున్నా యి. చేపలు పట్టే సమయంలో మత్స్యకారులకు ఇబ్బందులు తలెత్తినా.. ప్రమాదం సంభవించినా ప్రభుత్వం రూ.5 లక్షల బీమాను అందిస్తున్నది. గతం లో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి బీమా సౌకర్యాన్ని కల్పించలేదు. మత్స్యకార సొసైటీలకు ఉచితంగా చేప పిల్లలను పం పిణీ చేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. చేప పిల్లల పంపిణీ, వచ్చే దిగుబడితో ప్రభుత్వానికి పైసా ప్రయోజనం లేకపోయినా వారి బతుకులకు భరోసా, భద్రతను కల్పిస్తున్నది. గత ఎనిమిదేండ్లుగా ఈ ప్ర క్రియ విజయవంతంగా కొనసాగుతున్నది.
జిల్లాలోని 650 చెరువుల్లో 35 నుంచి 40 మిల్లీమీట ర్లు.. 80 నుంచి 100 మిల్లీమీటర్లు ఉన్న చేప పిల్లలను వదిలారు. అందులో బొచ్చె, బంగారు తీగ, మోసు లాంటివి ఉన్నాయి. 2015 నుంచి ఇప్పటివరకు జిల్లాలోని జలాశయాల్లో నీరు నిలువ తగ్గలేదు. కాగా, ఒక్కొక్క చేప పిల్ల రెండు కేజీల నుంచి ఏడు కేజీల వరకు పెరిగాయి. ప్రస్తుతం జిల్లాలోని అన్ని చెరువుల్లో కలుపుకొని ఏడాదికి 4000 టన్నుల నుంచి 5000 టన్నుల వరకు దిగుబడి రానున్నట్లు.. రాబడి రూ.32 కోట్ల నుం చి రూ.40 కోట్ల వరకు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చేపలను కిలోకు రూ.80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు. ఈ రాబడి కేవలం మత్స్యకారులకే సొంతం. వారు ప్రభుత్వానికి ఏలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరంలేదు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నది. వారి కోసం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదులుతున్నది. అవి పెరి గి పెద్దవిగా మారిన తర్వా త వాటిని విక్రయించి.. ఆర్థికంగా వృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నది. జిల్లాలో 150 మత్స్యకార సంఘాలున్నాయి. ఆ సంఘాల ఆధ్వర్యంలోనే చేప పిల్లలను చెరువులు, జలాశయా ల్లో వదలడం జరిగింది. అవి ప్రస్తుతం ఒక్కొక్కటి రెండునుంచి ఆరేడు కేజీల వరకుఉన్నాయి. కేజీ రూ. 80 నుంచి రూ.100 వరకు అమ్ముడవుతున్నాయి.
– సుకీర్తి, జిల్లా మత్స్య శాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా
గత ఆరు, ఏడేండ్లుగా ‘మిషన్ కాకతీయ’ పుణ్యమా అని చేవె ళ్ల పరిధిలోని పలు చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో అధికారులు వాటిలో చేప పిల్లలను వదిలారు. ఒక్కొక్కటి రెండునుంచి ఆరేడు కేజీల వర కు పెరిగాయి. సొసైటీల ఆధ్వర్యంలో ఇప్పుడిప్పుడే చేపలు పడుతున్నాం. వంద శాతం రాయితీ ఇవ్వడంతో మా బతుకులకు ఢోకాలేదు. తెలంగాణ ప్రభుత్వానికి మా కుటుంబాల తరఫున ధన్యవాదాలు. -అరుణ్కుమార్, మత్స్యకారుడు,
ఆలూరు గ్రామం, చేవెళ్ల మండలం
ప్రస్తుతం చెరువులు నీటితో కళకళలాడుతున్నా యి. చేపల పెంపకానికి ఇబ్బంది లేదు. అంతేకాకుండా ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నది. చేప పిల్లల పంపిణీలో వంద శాతం రాయితీ ఇచ్చి ప్రభుత్వం మా బతుకుల్లో వెలుగులు నింపుతున్నది. మా అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం. – కావలి నర్సింహులు,
మత్స్యశాఖ గ్రామ అధ్యక్షుడు,
చందన్వెల్లి