దుద్యాల మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ సిడె శుక్రవారం ఘనంగా నిర్వహించారు. లక్షలమంది భక్తులు తరలిరాగా.. ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. ఎల్లమ్మ తల్లీ మమ్మల్ని చల్లంగ చూడు అంటూ వేడుకున్నారు.
-బొంరాస్పేట, ఫిబ్రవరి 10
బొంరాస్పేట, ఫిబ్రవరి 10: దుద్యాల మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతరలో శుక్రవా రం ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం అత్యం త వైభవంగా జరిగింది. ఎల్లమ్మ తల్లీ మమ్మల్ని చల్లంగ చూడు అంటూ మేళతాళాలు, డప్పు చప్పుళ్లు, మరోవైపు రెండు లక్షలకుపైగా తరలివచ్చిన భక్తుల మధ్య ఎల్లమ్మ తల్లి సిడె కార్యక్రమం సాయంత్రం 5.35 నుంచి 6.00 గంట ల వరకు శోభాయమానంగా జరిగింది. అంతకు ముందు జల్ది ఉత్సవంలో భాగంగా ఆలయంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి గుడికి సమీపంలో ఉన్న బావి దగ్గరకు మేళతాళాలు, కొమ్ము వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లారు. గుడి ఎదుట కుంభం పోసిన తర్వాత ఉత్సవ కమిటీ చైర్మన్ ముచ్చటి వెంకటేశ్, ఆలయ మేనేజర్ రాజేందర్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించిన రథానికి ఉన్న పొడవైన స్తంభానికి చివరన ఏర్పాటు చేసిన తొట్లెలో ఉంచి ఆలయం చు ట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయించారు. ఈ సమయంలో అమ్మవారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. భక్తులు వేపాకు, పసుపు, గవ్వలు కలిపిన గవ్వల బండారును అమ్మవారి విగ్రహంపైకి చల్లి మొక్కుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు పొరుగు జిల్లాలు, మహారాష్ట్రలోని షోలాపూర్, భీవండి, గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్ల నుంచి దాదాపుగా రెండు లక్షలకుపైగా భక్తులు హాజరయ్యారు. సిడె కార్యక్రమం జరిగినంత సేపూ ఆలయం కనుచూపు మేరలో ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు. సిడెను కనులారా తిలకించి భక్తు లు ఆనంద పరవశులయ్యారు. దర్శనం కోసం భక్తులు క్యూ కట్టడంతో ఆలయం ఎదుట భారీ జన సందోహం కనిపించింది. అమ్మవారికి బో నం కుండలు, మేకపోతులు, కోడి పుంజులతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తమ కష్టాలు తీరాలని.. కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని వేడుకున్నారు. తెలంగాణ సంప్రదాయమైన బోనాలతో పోలేపల్లి గ్రామ మహిళలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కొం దరు భక్తులు తలనీలాలు సమర్పించి కోనేరు లో స్నా నాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నా రు. పూనకం నిండిన మహిళల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు జాతరలో ఆకర్షణగా నిలి చాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజ లు చేశారు. పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ వారు సన్మానించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ట్రాఫిక్ జాం.. ఇబ్బందుల్లో భక్తులు
పోలేపల్లిలో జరిగిన ఎల్లమ్మ జాతరలో ట్రాఫిక్ స్తంభించి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం సిడె సమయంలో పోలీసులు బందోబస్తు నిమిత్తం ఆలయ పరిసరా ల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో హకీంపేట కమాన్ వద్ద పోలీసులు లేకపోవడంతో అక్కడి నుంచి ఆలయం వరకు రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎల్లమ్మ దర్శనం, సిడెను తిలకించేందుకు భక్తులు కాలినడకన, వాహనాల్లో రావడం.. మరోవైపు జాతర నుంచి భక్తులు వాహనాల్లో తిరిగి ఇండ్లకు వెళ్తుండటంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
అనంతరం పోలీసులు వచ్చి అరగంటలో ట్రాఫిక్ను క్లియర్ చేయడంతో భక్తులు వెళ్లిపోయాయి. అదేవిధంగా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉం డేందుకు ఆలయ కమిటీ వారు తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది అక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జాతరలో తప్పిపోయిన చిన్నారులను పోలీసులు మైకుల ద్వారా తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించారు.