యాచారం : మండలంలోని తమ్మలోనిగూడ, నందివనపర్తి గ్రామాల్లో బీరప్ప బోనాలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
బీరప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో భక్తులు, ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చాలని మొక్కులు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు కాలె సంతోష, ఉదయశ్రీ బీఎన్రెడ్డి ట్రస్టు చైర్మన్ బిలకంటి శేఖర్రెడ్డి పాల్గొన్నారు.