ఆమనగల్లు, ఏప్రిల్ 23 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో మసీదు ఆవరణలో మసీదు కమిటీ అధ్యక్షుడు మాసుమ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మైనార్టీలకు రంజాన్ పండుగను పురస్కరించుకొని 300 కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ వర్గాలకు విద్య, ఉపాధి రంగాల్లో వెనుకబాటుకు గురికాకుండా సీఎం కేసీఆర్ వారిని ప్రొత్సహిస్తున్నట్లు గుర్తు చేశారు.
టీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనంతరం తాసిల్దార్ పాండూనాయక్ ఆధ్వర్యంలో 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరియాదవ్, వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నిట్టనారాయణ, కౌన్సిలర్లు రాధమ్మ , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్రావు, డైరెక్టర్లు సుభాశ్, రమేశ్నాయక్, సర్పంచ్ శ్రీను పాల్గొన్నారు.
ఆమనగల్లు మున్సిపాలిటీలో శనివారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ 12 వార్డు శాంతినగర్ కాలనీలో సుడిగాలి పర్యటన చేశారు. వార్డులో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయా కాలనీలో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వార్డులో మిషన్ భగిరథ ద్వారా మంచినీళ్లు సరఫరా కావడం లేదని, అంతర్గత మురుగు కాల్వల నిర్మాణం తదితర సమస్యలను ఎమ్మెల్యేకి స్థానికులు వివరించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ పాలకవర్గం తన దృష్టికి సమస్యలను తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. మున్సిపాలిటీలో మిషన్ భగీరథ పథకం కింద శాశ్వతంగా నీటి సమస్యలు తీర్చేందుకు నిధులు తీసుకొస్తానని ఆయన హామీనిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్సుందర్, వివిధ శాఖల అధికారులు ప్రభాకర్రెడ్డి, మధులత, టీఆర్ఎస్ నాయకులు రఘు, బాలస్వామి, జయరాం, భాస్కర్, వెంకటేశ్ పాల్గొన్నారు.
తలకొండపల్లి : అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని చుక్కాపూర్, యడవెల్లి, చెన్నరం, తలకొండపల్లి, చీపునుంతల జంగారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆకాల వర్షంతో నష్టపోయిన రైతుల పంటల వివరాలను ఉన్నతాధికారులకు పంపించాలన్నారు. మండలంలో 400 ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని ఏవో తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రాజు, సర్పంచ్ కిష్టమ్మ, రైతు సమన్వయ సమితి మండల సభ్యులు, రైతులు పాల్గొన్నారు.