కొడంగల్, ఫిబ్రవరి 8: కొడంగల్ శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాల యంలో రథసప్తమి వేడుకలు మంగళవారం వైభవంగా జగాయి. ఆల యంలో ఉదయం నుంచి స్వామి వారికి అర్చకులు ప్రత్యేక కైం క ర్యాలను నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ శ్రీవారు సూర్య ప్రభ,, పెద్ద శేష, హనుమంత వాహనాలపై కొలువుదీరి పట్టణ వీధుల్లో ఊరేగారు. దారి పొడవునా భక్తులు దేవదేవుడికి మంగళహారతులు ఇచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం శ్రీదేవీ భూదేవీ సమేతుడైన ఆ మహావిష్ణు వుకు పరిమళ ద్రవ్యాలతో పాటు పూలు, పండ్లతో అభిషేకం చేశారు. సాయం కాలం చంద్రప్రభ, సింహ, హంస వంటి సప్తవాహ నాలపై శ్రీవారు కొలువు దీరారు. చిన్నశేష, కల్పవృక్ష వాహనాలపై శ్రీవారు ఆసీనులై పూజ లందుకున్నారు. ఆ సుందర దృశ్యాలను తిలకించేందుకు భక్తులు కిక్కిరిసి పోయారు. తిరుమల తర హాలో జరిగే రథసప్తమి ఉత్సవాలను పోలిన మాదిరిగా కొడంగల్ శ్రీ మహా లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వ హిస్తుండటంతో సాక్షాత్తూ తిరుమలేశుడిని దర్శించుకున్నంత భాగ్యం కలి గిందని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
అనంతపద్మనాభస్వామి దేవాలయంలో మంగళ వారం రథసప్తమిని ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. స్వామి వారిని సప్త వాహనాలపై ఊరేగించారు. భక్తులు స్వామివారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపులో ఆలయ ఈవో నరేందర్, ఆల య ఫౌండర్ పద్మనాభం, ప్రజా ప్రతినిధులు, భక్తులు ఉన్నారు. అనంత రం పట్టణ సమీ పంలో ఉన్న సూర్యనారాయణ దేవాలయంలో ధ్వజారో హణ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి అభిషేకం చేశారు.
పరిగి మున్సిపల్ పరిధిలోని హౌసింగ్బోర్డు కాలనీ లో వెలసిన శ్రీషిర్డీ సాయిబాబా ఆలయంలో మంగళవారం ఆర్యవైశ్య వాస వీ సంఘం ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 24 మంది దంపతులతో హోమాలు నిర్వహించి 24 మంది బ్రాహ్మణ దం పతులకు పాదపూజ వస్త్రదానం చేశారు. అనంతరం అన్నదాన కార్య క్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకు తోట సత్యనారాయణ, వేముల పాండురంగం, ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ దేవేందర్రెడ్డి, కౌన్సిలర్లు వేముల కిరణ్, ఎదిరే కృష్ణ, మాజీ సర్పంచ్ సిద్ధాంతి పార్థసారథి, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాలాది శ్రీనివాస్, కడ్మూర్ శ్రీనివాస్, గణేష్, లచ్చు పాల్గొన్నారు.
కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ శ్రీకోదండ సీతారామ ఆలయ ఉత్సవాలు దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రథసప్తమి సందర్భంగా హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. భజనలు, కీర్తనలు ఆలపించారు.