ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ సై అంటున్నది. ఇప్పటికే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్లు కేటాయించగా.. వారు సమరానికి సన్నద్ధమవుతున్నారు. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్య యాదవ్, కాలె యాదయ్య, జైపాల్ యాదవ్లు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ నిత్యం బిజీబీజీగా గడుపుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రామాలు, పట్టణాలకు వస్తున్న ఎమ్మెల్యేలకు జిల్లా ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఎదురెళ్లి ఘన స్వాగతం చెబుతూ ‘మళ్లీ మీరే గెలువాలి.. మరింత అభివృద్ధి జరుగాలి’ అంటూ నినదిస్తున్నారు. ఆయా సంఘాలు సైతం సంపూర్ణ మద్దతు తెలుపుతూ ‘సారు.. కారుకే’ జై అంటున్నాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ వర్గాల ప్రజానీకంతో సందడిగా మారాయి. ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితి కనిపిస్తున్నది. టికెట్ ఎవరికి వస్తుందో తెలియని దయనీయ స్థితిలో నేతలు ఉండగా.. క్యాడర్ అయోమయంలో పడింది.
-రంగారెడ్డి, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ పార్టీ ముందుగానే సన్నద్ధమైనది. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అనుకున్నట్లే సిట్టింగ్లకే టికెట్లు ఇచ్చారు. జిల్లాలో టికెట్లు పొందిన మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, జైపాల్యాదవ్లు ఎవరికి వారుగా అస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రామాలకు వస్తున్న ఎమ్మెల్యేలకు ప్రజాలు సైతం ఘన స్వాగతం పలుకుతున్నారు. మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని పలు సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు పలికి సన్మానం చేస్తున్నారు. ‘కారే రావాలి..మళ్లీ మీరే గెలవాలి’ అంటూ నినదిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు సైతం ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ వర్గాల ప్రజానీకంతో సందడిగా ఉంటున్నాయి. ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితి కనిపిస్తున్నది. టికెట్ ఎవరికి వస్తుందో తెలియని దయనీయ స్థితిలో నేతలు ఉండగా..క్యాడర్ సైతం అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నది.
గత తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఈసారి ఎన్నికలకు గీటురాయి కానున్నాయి. వ్యవసాయానికి 24 గంటల కరెం టు, రైతు బీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, ఆసరా పింఛన్లు, దళితబంధు, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, బీసీలు, మైనార్టీలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం, గురుకుల పాఠశాలల ఏర్పాటు వంటి పథకాలతోపాటు ఇటీవల దివ్యాంగుల పింఛన్ పెంపు, ఆర్టీసీ, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రతకు సంబంధించి అనేక నిర్ణయాలు ప్రకటించి సీఎం కేసీఆర్ అమలు చేశారు. ఇవన్నీ సబ్బండ వర్ణాలకు వరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీని ఇంటి పార్టీగా భావించి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నివర్గాల ప్రజానీకం ప్రతిన బూనుతున్నది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి చేరికలు సైతం భారీగానే ఉంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీలతో విసిగిపోయిన క్యాడర్ బీఆర్ఎస్ వైపుగా చూస్తున్నది. నిత్యం ఎక్కడో ఒక చోట కచ్చితంగా బీఆర్ఎస్లోకి చేరికలు ఉంటున్నాయి.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 28 : బీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించటంతో ఆయనకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. మద్దతు తెలిపేందుకు వస్తున్న వారితో క్యాంపు కార్యాలయం ప్రతిరోజూ కోలాహలంగా మారుతున్నది. ఇప్పటికే తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ఇంజాపూర్, బ్రాహ్మణపల్లి, కొహెడ, యాచారం మండలం నుంచిమాల్, కొత్తపల్లి, మేడిపల్లి, నానక్నగర్, నందివనపర్తి, మంతన్గౌరెల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీతోపాటు పలు గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు మద్దతుగా బీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నాలుగోసారి పోటీచేస్తున్న మంచిరెడ్డికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మద్దతు అధికంగా లభిస్తున్నది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని వర్తకసంఘం నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి మంచిరెడ్డికి మద్దతు ప్రకటించారు. ఇటీవల నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులు కూడా సీఎం పింఛన్ను 4016కు పెంచిన సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించారు. మరోసారి ఎమ్మెల్యేను గెలిపించుకుంటామని వివిధ గ్రామాల నుంచి ఎమ్మెల్యేకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.
జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. సిట్టింగ్లకే మళ్లీ అవకాశం ఇచ్చి వారిపై సీఎం కేసీఆర్ పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ప్రజానీకం సైతం ఆదరిస్తున్నది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదోసారి బరిలో నిలుస్తున్నా రు. ఈ నేపథ్యంలో ఆమె నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. రెండు రోజుల క్రితం ఒక్క రోజులోనే 60 కార్యక్రమాల్లో ఓపికగా పాల్గొని అందరినీ ఆశ్చర్యపర్చారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, కల్వ కుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. షాద్నగర్ ఎమ్మె ల్యే అంజయ్యయాదవ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేలుగా ప్రజల్లో ఉన్న నమ్మకం తో సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే మళ్లీ టికెట్లు కేటాయించారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. పెద్దఎత్తున తరలివస్తున్న అభిమానులు, నేతలతో ఎమ్మెల్యేల ఇండ్లు, క్యాంపు కార్యాలయాలు నిత్యం కిటకిటలాడుతున్నాయి. అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లోనూ రెట్టింపు జోష్ కనిపిస్తున్నది.
ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు సెగ్మెంట్లో పెరుగుతున్న మద్దతు
ఆమనగల్లు, ఆగస్టు 28: బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా మూడోసారి కూడా జైపాల్యాదవ్ ఖరారు కావడంతో సెగ్మెంట్లోని పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ కుల, యువజన, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. అంతేకాకుండా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ లో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో అధికంగా చేరుతున్నారు. రానున్న ఎన్నికల్లో మీ వెంటే ఉండి భారీ మెజార్టీతో గెలిపిస్తాయని వారు పేర్కొంటున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక కృషితో ఇటీవలే కల్వకుర్తిలో ఉన్న 50 పడకల దవాఖానను ప్రభుత్వం 100 పడకలుగా అప్గ్రేడ్ చేసి నిధులు కూడా మంజూరు చేసింది. ఆమనగల్లులో ప్రభుత్వ డిగ్రీ, పాల్టెక్నిక్ కళాశాల లను ఏర్పాటు చేశారు. అన్ని గ్రామాలు, తండాల్లో కోట్లాది రూపాయలతో సీసీ, బీటీ రోడ్లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గాభివృద్ధికి కృషి చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ విజయం రానున్న ఎన్నికల్లో తథ్యమని ప్రజలు పేర్కొంటున్నారు.