‘మీతోనేను’లో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్, జూన్ 23: రైతులకు కంది విత్తనాలను ఉచితంగా ప్రభుత్వమే అంద జేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని పీలారం గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. గ్యాస్ ధరలు ఎక్కువగా ఉన్నా యని, కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న మహిళను పలుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ గ్రామంలో మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాడుకలోకి తీసుకరావాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు బీమా కల్పిస్తున్నదని, ఇంకా దరఖాస్తు చేసుకోనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వారు దరఖాస్తులు చేసుకునేలా అవగాహన కల్పించాలని వ్యవసా యాధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో రైతులకు కంది విత్తనాల మినీ కిట్స్ పంపిణీ చేయాలని వ్యవసాయాధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ భార తమ్మ, ఎంపీడీవో సత్తయ్య, ఎంపీవో నాగరాజు పాల్గొన్నారు.
కంది సాగును ప్రోత్సహించేందుకు ..
మోమిన్పేట,జూన్ 23: కంది సాగు ప్రోత్సహించేందకు ప్రభుత్వం రైతులకు ఉచితంగా కంది విత్తనాలు సరఫరా చేసిందని మండల వ్యవసాయాధికారి జయశంకర భూపతి అన్నారు. గురువారం మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో, మేకవనంపల్లి రైతు వేదికలో రైతులకు కంది విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వరి సాగుకు బదులు కంది సాగు ప్రోత్సహించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా మండాలనికి 330 కందుల చిరు సంచులను రైతులకు పంపిణీ చేసేందుకు అందించాయన్నారు. మండలంలో నిటేకులపల్లి, మోమిన్ పేట, మేకవనంపల్లి, కేసారం, వెల్చాల్ రైతు వేదికల్లో ఈ చిరు సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు.తమ తమ రైతు వేదిక క్లస్టర్ల ఏఈవోలు విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.విత్తనాల పం పిణీలో మేకవనంపల్లి సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, ఏఈవోలు మనీషా,చంద్రిక ఉన్నారు.