బడంగ్పేట, మే 13 : ప్రణాళికాబద్ధంగా మహేశ్వరం నియోజకవర్గాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఆమె బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20, 21, 23, 28, 31, 32 డివిజన్లలో రూ.9.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కనీస సౌకర్యాల కల్పన కోసం కార్పొరేషన్ నిధులతోపాటు ప్రభుత్వ ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నియో జకవర్గంలోని తుక్కుగూడ, జల్పల్లి, బడంగ్పేట, మీర్పేటలలో రూ.18.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా చివరి మజిలీలో ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మాడ్రన్ వైకుంఠధామాలను నిర్మిస్తున్నామన్నారు.
పేదలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. అందుకోసం బస్తీ దవాఖానలతోపాటు అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నదన్నారు. నియోజ కవర్గంలో ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మిషన్ భగీరథ ద్వారా రిజర్వాయర్లు, పైపులైన్లను ఏర్పాటు చేయడంతోపాటు ఇంటింటికీ మంచి నీటి కనెక్షన్లు ఇస్తున్నమ న్నారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు చెరువులను సుందరీ కరిస్తున్నమన్నారు. తద్వారా వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కార్యక్రమంలో మేయర్ పారిజాతానర్సింహారెడ్డి, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డీఈ అశోక్రెడ్డి, జ్యోతి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
బీజేపీకి షాక్ ఇచ్చి.. బీఆర్ఎస్లో చేరిక
మహేశ్వరం : బీఆర్ఎస్తోనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతు న్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు సర్పంచ్ బండారు లావణ్యాలింగం, సహకార బ్యాంక్ చైర్మన్ పాండుయాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు రాజూనాయక్, ఉప సర్పంచ్ లతీఫ్ఖాన్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చంద్రయ్య ఆధ్వర్యంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షం లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
పార్టీకి అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లని ఆమె అభిప్రాయ పడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇస్తున్నారని కొనియాడారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకే ప్రతిపక్ష పార్టీల నాయకులు లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో వార్డు సభ్యులు బూర్గుల రాజు, సోమ్లానాయక్, బాలూనాయక్, కెండె నర్సింహ, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్నాయక్, బీజేపీ యూత్ అధ్యక్షుడు రఘూనాయక్, యాదగిరి, రాజు, బండారి శేఖర్ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అంగోతు రాజూనాయక్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చంద్రయ్య, సురేందర్రెడ్డి, ఆదిల్అలీ పాల్గొన్నారు.
మాడల్ స్కూల్ విద్యార్థులకు మంత్రి చేయూత
మాడల్ స్కూల్ విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చేయూతనందించారు. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అమెరికాలోని టెక్సాస్ నగరంలో జరుగనున్న ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు వెళ్తున్న మహేశ్వరం మాడల్ స్కూల్ విద్యార్థులకు శనివారం మంత్రి వాసవీ గ్రూప్ మేనేజ్మెంట్ ద్వారా సీఎస్ఆర్ ఫండ్స్ కింద రూ.6,11,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభ కలిగిన విద్యార్థులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని ఆక్షాంక్షిం చారు. మాడల్ స్కూల్ విద్యార్థులకు అన్ని విధాలా సహకరిస్తున్న మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి, యువ నాయకుడు కార్తిక్రెడ్డిలకు ప్రిన్సిపాల్ ధనుంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.