కులకచర్ల, డిసెంబర్ 8 : ప్రతిపక్షహోదాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కృషిచేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో గురుదత్త ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కులకచర్ల, చౌడాపూర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ స్కీములు ప్రజలకు ఏవిధంగా అందుతున్నాయో తెలుసుకొని వాటిని ప్రజలకు అందించేందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
పథకాలు ప్రజలకు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజల తరఫున పోరాటం చేయాలని తెలిపారు. పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా నిలుస్తానని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ రాందాస్నాయక్, బీఆర్ఎస్ చౌడాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు సత్తినేని సుధాకర్రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శంకర్నాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు రాజప్ప, మాలె కృష్ణయ్యగౌడ్, సారా శ్రీనివాస్, మేగ్యానాయక్, గుండుమల్ల నర్సింహులు, వివిధ గ్రామాల బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.