కులకచర్ల, డిసెంబర్ 9 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న చెల్లాపూర్ గ్రామానికి చెందిన పోలెపల్లి బచ్చయ్య ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందడంతో రూ.2లక్షల బీమా మంజూరైంది. దీంతో శనివారం చెల్లాపూర్ గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులకు 2లక్షల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తోందని అన్నారు. కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు 2లక్షల బీమా చేయించడం జరిగిందని అన్నారు. పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సేరి రాంరెడ్డి, చెల్లాపూర్ సర్పంచ్ పోలెపల్లి చంద్రయ్య, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు హరికృష్ణ, దామోదర్రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.