షాద్నగర్, ఏప్రిల్27: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చారని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని షాద్నగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు.
పదేండ్ల పాటు రాష్ర్టాన్ని సుభిక్షంగా పాలించిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలుపించుకోవాలని పిలుపునిచ్చారు. కేశంపేట, కొందుర్గు, ఫరూఖ్నగర్, చౌదరిగూడ, నందిగామ, కొత్తూరు మండలాల్లోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : కేసీఆర్ హయాంలోనే పేదలకు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ మండల పార్టీ అద్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని, అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని చెప్పారు.
అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో చేవెళ్ల అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింటు, డైరెక్టర్లు మహేశ్ యాదవ్, గని, మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, మాజీ సర్పంచ్లు గణేశ్, శ్రీనివాస్, రామచంద్రయ్య, నాయకులు రామగౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మొయినాబాద్ : స్వరాష్ట్రం .. స్వపరిపాలన ఉండాలని స్వరాష్ట్రం కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించిందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోంపల్లి అనంతరెడ్డి అన్నారు. పార్టీ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ ఉద్యమాలు కొత్త కాదని, ప్రజల తరఫున నిలబడి పోరాటాలు చేయడానికి పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.
పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి నర్సింహగౌడ్, ఉపాధ్యక్షుడు జయవంత్, ఎంఏ రావూప్, సుధాకర్యాదవ్, నాయకులు దారెడ్డి వెంకట్రెడ్డి, సంజీవరావు, మాజీ ఎంపీటీసీ రవీందర్, పరమేశ్, అంజయ్యగౌడ్, ప్రవీణ్, రామచందర్, అరవింద్, ముజ్జు, మల్లారెడ్డి, మహేశ్యాదవ్, చెన్నయ్యయాదవ్, తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని ఎన్కేపల్లి, హిమాయత్నగర్, రెడ్డిపల్లి, అజీజ్నగర్, తదితర గ్రామాల్లో ఎండాను ఆవిష్కరించారు.
కడ్తాల్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు, పోరాటాలతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో జడ్పీటీసీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి కార్యకర్తలు, పార్టీ అభిమానులకు తినిపించారు. అనంతరం నాగర్కర్నూల్ పట్టణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్డుషోలో పాల్గొనేందుకు కడ్తాల్ మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు పలు వాహనాల్లో తరలివెళ్లారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్, ఎంపీటీసీలు గోపాల్, మంజుల, లచ్చిరాంనాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు హరిచంద్నాయక్, నాయకులు వీరయ్య, సాయిలు, చంద్రమౌళి, శ్రీనునాయక్, పాండునాయక్, కృష్ణ, అంజి, గణేశ్, సురేశ్, శ్రీకాంత్, రాజశేఖర్, మహేశ్, రమేశ్, వేణు, రాజు, మల్లేశ్, శ్రీశైలం పాల్గొన్నారు.
షాబాద్ : శంకర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులతో కలిసి శంకర్పల్లి ఎంపీపీ గోవర్దన్రెడ్డి బీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు గోపాల్, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో శనివారం బీఆర్ఎస్పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాలుగౌడ్ గులాబీ జెండాను ఎగురవేశారు. మండల పరిధిలోని దండుమైలారంతో పాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.