షాద్నగర్, మే2: బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఎంపీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు దూసుకెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో ఆరు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. గురువారం షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 14, 16, 21 వార్డుల్లో కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు.
చటాన్పల్లి, రాంనగర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్, ఎంపీ ఎన్నికల ఇన్చార్జి దూదిమెట్ల బాల్రాజ్యాదవ్, కౌన్సిలర్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, కౌన్సిలర్లు శ్రీనివాస్గౌడ్, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాసులు, నాయకులు నారాయణరెడ్డి, రాంబాల్నాయక్, రాజ్యలక్ష్మి, యుగేందర్, రవియాదవ్, శేఖర్, శ్రీశైలం, పాండురంగారెడ్డి, శంకర్, కిషోర్, నర్సింహ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహదేవ్పూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, నాయకులు రామకృష్ణల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్గౌడ్, యాదయ్య, అబ్దుల్కలాం, విజేందర్రెడ్డి, మానయ్య, రామచంద్రయ్య, రెడ్డి నర్సింహులు, రాజరామేశ్వర్రెడ్డి, నజీర్, యాదయ్య, శేఖర్గౌడ్, సంజీవ, గణేశ్, గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.