రంగారెడ్డి, మే 13(నమస్తే తెలంగాణ) : చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ విజయాన్ని కాంక్షిస్తూ..అహర్నిశలు కష్టపడ్డ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ప్రజా ప్రతినిధులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధంగా భావించి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని ఓట్లు వేసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచార యజ్ఞంలో తన వెన్నంటి నిలిచిన ప్రజలకు, ముందుండి నడిపించిన పార్టీ నాయకులను, కార్యకర్తలను జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు.