కొత్తూరు, డిసెంబర్ 27 : మత్స్య సహకార సంఘాలను రెన్యూవల్ చేసుకోవాలని మత్స్య సహకార సంఘం ప్రత్యేక డిప్యూటీ రిజిస్ట్ట్రార్ సురేఖ అన్నారు. తెలంగాణ మత్స్య సహకారం సంఘాలు ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కొత్తూరు మండలంలోని గూడూరులో మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో సభ్యులకు మంగళవారం ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ తెలంగాణ సహకార సంఘాల చట్టం ప్రకారం ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటు చేసుకొని ఐదేండ్లు అయిన సందర్భంగా వాటిని రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. సహకార సంఘంలోని వివిధ అంశాలను సురేఖ సభ్యులకు వివరించారు. సభ్యుల అర్హతలు, అనర్హతల గురించి చెప్పారు. అలాగే సమావేశాల నిర్వహణ, పాలక వర్గ సభ్యుల ఎన్నికలు ఏ విధంగా నిర్వహించుకోవాలో సుభ్యులకు వివరించారు. కార్యక్రమంలో గూడూరు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సురేశ్, సభ్యులు రమేశ్, నర్సింహ, నారాయణ, శేఖర్, మల్లేశ్, కృష్ణ, గణేశ్, రాంచంద్రయ్య, కుమార్ పాల్గొన్నారు.