ఇబ్రహీంపట్నం, ఆగస్టు 26 : రూ.2కోట్లతో అధునాతన హంగులతో నిర్మించే ఫిష్ మార్కెట్తో ఇబ్రహీంపట్నం ఫిష్హబ్గా మారనున్నదని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం సమీపంలోని శేరిగూడ వద్ద ఆయన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి ఫిష్మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పెద్ద చెరువులో చేపపిల్లలు, రొయ్యలను వదిలి ఉచిత పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెద్దచెరువు సుందరీకరణతో పాటు సకల సౌకర్యాలతో ఫిష్మార్కెట్ను తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చేపలు కూడా ఈ ఫిష్మార్కెట్లో అమ్ముకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు మిషన్కాకతీయ పథకం ప్రాణం పోసిందన్నారు. ఈ చెరువుకింద 1250 హెక్టార్ల ఆయకట్టు ఉందన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం భవిష్యత్తు లో ఫిష్ హబ్గా మారనున్నదని.. నగరంలోని రాంనగర్ ఫిష్మార్కెట్ తరహాలోనే ఈ మార్కెట్ను కూడా డెవలప్ చేస్తామని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం ఆయ న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో కలిసి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో రూ. రెండు కోట్ల విలువ చేసే ఉచిత చేప, రొయ్య పిల్లలను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన ఇబ్రహీంపట్నం సమీపంలోని శేరిగూడ వద్ద ఫిష్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కోరిక మేరకు ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణతోపాటు శేరిగూడ సమీపంలో ఉన్న చేపపిల్లల పెంపక కేంద్రం ఆవరణలో అత్యాధునిక హంగులతో ఫిష్మార్కెట్ను నిర్మిస్తామన్నారు. పిష్ మార్కెట్ నిర్మాణానికి ముందుకొచ్చే వారికి రూ.10 నుంచి రూ. 20లక్షల వరకు మాత్రమే ఇస్తున్నామని.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కోరిక మేరకు రూ.2 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తైతే ఇబ్రహీంపట్నం ఫిష్హబ్గా మారనున్నదన్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్, దేవరకొండతో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి చేపలను తీసుకొచ్చి నగరంలోని రాంనగర్లో విక్రయిస్తారని అన్నారు. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తైతే నాగార్జునసాగర్తోపాటు ఇబ్రహీంపట్నం చుట్టపక్కల ప్రాంతాల్లోని చెరువుల్లోని చేపలను ఇక్కడే విక్రయించొచ్చన్నారు.
ఇక్కడే కోల్డ్స్టోరేజీనూ నిర్మిస్తామన్నారు. తద్వారా మత్స్యకారులకు ఉపాధితోపాటు దూరభారం కూడా తప్పుతుందన్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో సుమారు ఐదు నుంచి ఆరు లక్షల చేప పిల్లలను వదలడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రం థాలయ సంస్థ జిల్లా చైర్మన్ రమణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, రాష్ట్ర నాయకుడు ప్రశాంత్కుమార్రెడ్డి, ఎంపీపీ కృపేశ్, జిల్లా పశుసంవర్ధ్దకశాఖ అధికారి అంజిలప్ప, మత్స్యశాఖ జిల్లా అధికారిణి సుకీర్తి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్చైర్మన్ ఆకుల యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, సహకార సంఘం అధ్యక్షులు సుదర్శన్రెడ్డి, వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు శ్వేత, పద్మ, విశాల, సుల్తాన్, అంజిరెడ్డి, మోహన్రెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు గోపాల్, నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.