షాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య సర్వే ముమ్మరంగా సాగుతుంది. బుధవారం నుంచి రెండో విడత ఫీవర్ సర్వే ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో 30,809 ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించిన్నట్లు జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇందులో 429మందికి జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, హెల్త్కిట్స్ అందజేశారు. గత నెలలో మొదటి విడుతలో పది రోజుల పాటు సర్వే నిర్వహించి విజయవంతంగా పూర్తి చేసిన వైద్యశాఖ, రెండో విడుత ఫీవర్ సర్వే వేగవంతం చేశారు.
మొదటి, రెండో విడుతలో కలిపి ఇప్పటివరకు జిల్లాలో 6,11,554 ఇండ్లలో ఫీవర్ సర్వే నిర్వహించగా 14,884 మందికి జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించి హెల్త్కిట్స్ అందించిన్నట్లు తెలిపారు. కొవిడ్ పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య సిబ్బంది సలహాలు, సూచనలు అందించడం జరుగుతుంది. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.