పంట రుణాల మాఫీపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతుల సంబురాలు అంబరాన్నంటాయి. స్వీట్ల్ల పంపిణీ, ర్యాలీలు, పటాకుల మోతతో ఊరూరా పండుగ వాతావరణం కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ జేజేలు పలికారు. షాబాద్లో జరిగిన సంబురాల్లో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, షాద్నగర్లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సంక్షేమంలో రాజీపడకుండా పాలన సాగిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
-రంగారెడ్డి, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రైతుల పంట రుణాల మాఫీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో జిల్లాలో గురువారం సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు ఊ రూ రా పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహించారు. చాలా చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించి కృతజ్ఞతను చాటుకున్నారు. రైతుల కు సీఎం కేసీఆర్ సాయపడుతున్న సందర్భాన్ని మన నం చేసుకున్నారు. రైతన్నలతో కలిసి రుణమాఫీ సంబురాలను ఘనంగా నిర్వహించాలన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మం త్రి కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అధిక సం ఖ్యలో సంబురాల్లో భాగస్వామ్యులయ్యారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడలో జరిగిన సంబురాల్లో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, ఫరూఖ్నగర్లో నిర్వహించిన సంబురాల్లో వ్యవసాయ సహకార సం ఘాల కార్పొరేషన్ చైర్మన్ రాజావరప్రసాద్ పాల్గొన్నా రు. పలు మండలాల్లో జరిగిన వేడుకల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ, పట్ట ణ శాఖలు, రైతుబంధు, పార్టీ అనుబంధ సంఘా ల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
జిల్లాలో 1,47 లక్షల మందికి విముక్తి..
జిల్లాలో చేపడుతున్న రుణమాఫీతో 1,47,075 మంది అప్పుల నుంచి విముక్తి పొందనున్నారు. 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 లోపు రుణం తీసుకున్న రైతులకు రూ.లక్ష లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది. ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీతో రైతులు చేసిన రూ.300 కోట్ల అప్పులు దశల వారీగా మాఫీ కానున్నాయి. మొదటి విడుత రుణ మాఫీలో భాగంగా రూ. 25 వేల లోపు రుణం తీసుకున్న 10,940 మంది రైతులకు సంబంధించి రూ.16.73 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో విడుతలో రూ.50 వేల లోపు రు ణం తీసుకున్న 9,579 మందికి సంబంధించి రూ. 31.14 కోట్ల రుణాలను మాఫీ చేసింది. మిగతా వారికి రైతుబంధు పథకం మాదిరిగానే రుణ మాఫీ డబ్బులను సెప్టెంబర్ రెండో వారం లోపు రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనున్నది. సంక్షోభ సమయంలోనూ సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో పంటల రుణా లను మాఫీ చేస్తూ రైతులకు ఆర్థిక తోడ్పాటును అందించడంపై జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ.. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అన్నదాతల హర్షం
వికారాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై వికారాబాద్ జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు ఊరూరా క్షీరాభిషేకాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన సంబురాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి మున్సిపాలిటీలో జరిగిన వేడుకల్లో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పాల్గొన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేండ్ల కాలంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ను అమలు చేస్తున్నది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నది. అదేవిధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం….. మరోసారి రూ.లక్ష రుణమాఫీలో భాగంగా ఇప్పటికే దాదాపుగా రూ.40 వేల వరకు పంట రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం మిగతా పంట రుణాలనూ మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ బుధవారం గ్రీన్సిగ్నల్ ఇవ్వగా గురువారం నుంచి రుణమాఫీ ప్రక్రియ షురూ అయ్యింది. అయితే విడుతల వారీగా సెప్టెంబర్ రెండో వారంలోగా ఈ ప్రక్రియను మొత్తం పూర్తి చేయనున్నారు. కాగా రెండో విడు త రుణమాఫీలో భాగంగా రూ.25 వేల లోపు రుణాలకు సంబంధించి 10,807 మంది రైతులకు రూ.16.24 కోట్లు, రూ.25 వేల-రూ.50 వేల వరకు గల రుణాలకు సంబంధించి 27,628 మంది రైతులకు రూ.78.04 కోట్ల పంట రుణాలు ఉండగా, ఇప్పటివరకు రూ.40 వేల పంట రుణాల వరకు 21,193 మంది రైతులు తీసుకున్న రూ.70 కోట్ల వరకు ప్రభుత్వం మాఫీ చేసింది. మిగతా రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు గల 44 వేల మంది రైతులు తీసుకున్న రూ. 318 కోట్ల రుణాలను 45 రోజుల్లోగా మాఫీ చేయనున్నారు. రైతులు ఆనందపడుతున్నారు.
రైతులకు అండగా ప్రభుత్వం
చిన్న, సన్నకారు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా అన్నదాతకు అండగా నిలువలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వమే రైతులకు అండగా ఉన్నది. ముఖ్యమంత్రి హామీ ఇస్తే కచ్చితంగా నెరవేర్చుతారని మరో నిజమైనది. రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటా.
-పల్లె గోపాల్గౌడ్, ఆదిబట్ల మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుడు
రైతుబాంధవుడు సీఎం కేసీఆర్
గత టీడీపీ హయంలో దండగా అనుకున్న వ్యవసాయం నేడు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో పండుగలా మారింది. ముఖ్యమంత్రి రైతన్నల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు. అంతేకాకుండా రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను మా ఫీ చేస్తున్నట్లు ప్రకటించడం చాలా సంతోషకరం. రుణమాఫీ చేయడం వల్ల రైతులకు ఎంతో భరోసా కలుగుతుంది. సీఎం కేసీఆర్ కు రైతులు రుణపడి ఉంటారు. రైతు బాంధవుడు మన కేసీఆర్.
-కోర్రే జంగయ్య, బీఆర్ఎస్ నాయకుడు ఆదిబట్ల