దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ ముందుకెళ్తున్నది. ఉపాధి పొందుతూనే మరో పదిమందికి పని కల్పించే స్థాయికి దళితులు ఎదుగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. ఇందులో భాగంగానే దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. మొదటగా నియోజకవర్గానికి వంద యూనిట్లను మంజూరు చేయగా.. రంగారెడ్డి జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక తుది దశకు చేరింది. జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలుండగా.. 800 మంది కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు అప్పగించడంతో అర్హులనే వారు ఎంపిక చేస్తున్నారు. తుది జాబితాను జిల్లా మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమోదించిన అనంతరం కలెక్టర్కు అందజేయనున్నారు. అయితే జాబితాలోని లబ్ధిదారులకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా లబ్ధిదారులకు నచ్చిన యూనిట్లు కేటాయించడంతోపాటు వ్యాపార నిర్వహణకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఏదేమైనా మార్చిలో లబ్ధిదారులు తమ వ్యాపారాలను ప్రారంభించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
-రంగారెడ్డి, జనవరి 30, (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జనవరి 30, (నమస్తే తెలంగాణ) : దళితబంధు లబ్ధిదారుల ఎంపిక తుది దశకు చేరుకున్నది. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని జిల్లా మంత్రి సబితారెడ్డి సూచించడంతో ఆ దిశగా తుది జాబితాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నిజమైన పేద దళిత కుటుంబాలనే స్థానిక ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తున్నారు. లబ్ధిదారుల తుది జాబితాకు జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆమోదం తెలుపనున్నారు. తదనంతరం లబ్ధిదారుల జాబితా కలెక్టర్కు అందజేయనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల దళితబంధు లబ్ధిదారుల జాబితాను కలెక్టర్కు అందజేసేందుకు ఎమ్మెల్యేలు కసరత్తును వేగవంతం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ చేపట్టనున్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకునే యూనిట్లను గ్రౌండింగ్ చేయనున్నారు. తొలుత నియోజకవర్గానికి వంద యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయనున్నది. జిల్లాలో మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కల్వకుర్తి నియోజకవర్గాలకు కలిపి 800 మంది కుటుంబాలకు తొలి విడుతలో లబ్ధి చేకూరనున్నది.
ఫిబ్రవరి నెలాఖరులోగా గ్రౌండింగ్..
సమాజంలో అట్టడుగు వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతోపాటు మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగనున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తైన వెంటనే దళిత కుటుంబాల పేరిట బ్యాంకు ఖాతాను తెరవనున్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు సంబంధించి యూనిట్లను జిల్లా యంత్రాంగం మంజూరు చేయనున్నది. లబ్ధిదారులకు నచ్చిన యూనిట్ను ఎంపిక చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. వీటిలో నైపుణ్యాన్ని పొందేందుకుగాను అవగాహన కల్పించడంతోపాటు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.10 లక్షల యూనిట్లో రూ.10వేలతో రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారు. వ్యాపారం లోగాని ఇతరత్రా ఏదైనా కష్టమొచ్చినప్పుడు రక్షణ నిధిలోని డబ్బులతో లబ్ధిదారులను ఆదుకునేందుకుగాను రక్షణ నిధి ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏదేమైనా మార్చి 7లోగా లబ్ధిదారులందరూ వారు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి వ్యాపారాలు ప్రారంభించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
ఈనెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి..
ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈనెలాఖరులోగా పూర్తవుతుందని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్రెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ చేపట్టి, తర్వాత గ్రౌండింగ్ ప్రక్రియ చేపడుతామన్నారు. యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులదే తుది నిర్ణయమని, ఫిబ్రవరి నెలాఖరులోగా గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేసి, మార్చి 7లోగా లబ్ధిదారులు వ్యాపారాలను ప్రారంభించేలా చర్యలు చేపడుతామన్నారు.
వ్యవసాయ, అనుబంధ పథకాలు
ఉత్పత్తి పథకాలు..
సేవలు..
మరేదైనా పథకం.. ట్రాన్స్పోర్ట్..
రిటైల్ దుకాణాలు..