చేవెళ్ల రూరల్, జనవరి 6: వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో రైతులు పంటలను సాగు చేసి, అధిక దిగుబడుల ను సాధించాలని కేంద్ర అధికారుల బృం దం సభ్యులు సూచించారు. శుక్రవారం మండలంలోని మల్కాపూర్ గ్రామాన్ని వా రు సందర్శించారు. గ్రామంలోని రైతులను నేరుగా కలుసుకొని పంటల యాజమాన్య పద్ధతులు, వ్యవసాయ పథకాల తీరు, నిర్వహణ, పంటల దిగుబడి, తెల్ల కుసుమలు, వర్షాధారిత ప్రాంత ఆధారిత అభివృద్ధి పథకం (ఆర్ఏడీ)లో భాగంగా గేదెలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కేం ద్ర అధికారుల బృందం సభ్యులు మాట్లాడుతూ వ్యవసాయాధికారుల సూచనలతో పంటలను సాగు చేసి మంచి దిగుబడుల ను పొందాలన్నారు. ఆ బృందంలో అనిల్కుమార్, చంద్రశేఖర్, హన్మంతు, సాగర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, ఏడీఏ రమాదేవి, మండల వ్యవసాయాధికారి తులసి, ఉద్యానవన శాఖ మండలాధికారి అశోక్, వ్యవసాయ విస్తరణాధికారులు వరుణ్, రమేశ్, సర్పంచ్ శివారెడ్డి, ఎంపీటీసీ రవీందర్రెడ్డి, రవీందర్, రైతులు కాంతారెడ్డి, మహేందర్, సత్తయ్య, సంజీవ పాల్గొన్నారు.