కడ్తాల్, సెప్టెంబర్ 29 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలో పచ్చని పొలాల్లో ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ను అలైన్మెంట్ను మార్చే వరకు పోరాటం ఆపేదిలేదని బాధిత రైతులు అన్నారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తూ కడ్తాల్ మండల కేంద్రంలో బాధిత రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 22వ రోజుకి చేరుకున్నాయి. సోమవారం చేపట్టిన దీక్షలో రామకృష్ణ, జంగయ్యయాదవ్, రాములుగౌడ్, వెంకట్రాములుగౌడ్, రాములుయాదవ్ కూర్చున్నారు. దీక్షలో కూర్చున్న వారికి రాజకీయ, యువజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైటెన్షన్ విద్యుత్లైన్తో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. విద్యుత్లైన్ అలైన్మెంట్ను మార్చి రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, బీచ్యానాయక్, పెంటారెడ్డి, పర్వత్కుమార్యాదవ్, శ్రీరాములుగౌడ్, రాజేందర్యాదవ్, వెంకటేశ్, సత్యం, కృష్ణయాదవ్, కేశవులుగౌడ్, పాండుయాదవ్, మహేశ్, రాఘవ, శ్రీనివాస్, సత్యనారాయణ, సురేశ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.