షాద్నగర్, జనవరి 6 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా తమ పంటలను సాగు చేసుకుంటున్నారని, నేటి తరం యువత వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రైతు బంధు సంబురాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభను చూపిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రైతు సంక్షేమం కోసం పరితపిస్తున్న తీరును దేశంలోని అన్ని రాష్ర్టాల రైతులు హర్షిస్తున్నారని అన్నారు. పలువురు విద్యార్థులు గీసిన చిత్రాలను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజ ఇద్రీస్, ఎంఈవో శంకర్రాథోడ్, టీఆర్ఎస్ నాయకులు నారాయణ పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నందిగామ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభు త్వం పని చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో సర్పంచ్ కవిత ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్తో కలిసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రియాంకగౌడ్, ఎంపీడీవో బాల్రెడ్డి, ఏవో శ్వేత, రైతు సంఘం నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
చన్వెల్లి ప్రభుత్వ పాఠశాలలో సంబురాలు
చేవెళ్ల రూరల్ : మండల పరిధిలోని చన్వెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం రైతు బంధు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ రమాదేవి విద్యార్థులకు వ్యవసాయం ప్రాధాన్యత, నాడు, నేడు వ్యవసాయ రంగ పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత, రైతు సంబంధిత అంశాలు అనే విషయాలపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కృష్ణమోహన్, మండల వ్యవసాయ విస్తరణాధికారి శివకుమార్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రైతుబంధుతో రైతుకు భరోసా
కొత్తూరు : రైతుబంధు పథకం రైతుకు భరోసా ఇస్తుందని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. కొత్తూరు జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు వ్యాస రచన, రంగోలీ, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు బంధు వల్ల తెలంగాణ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పు వచ్చిందన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, నాయకులు దేవేందర్యాదవ్, పెంటనోళ్ల యాదగిరి, బ్యాగరి యాదయ్య, వెంకటేశ్, విద్యా కమిటీ చైర్మన్ లక్ష్యయ్య, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు భానుప్రకాశ్, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
రైతు బాంధవుడు కేసీఆర్
కొత్తూరు రూరల్ : రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, సర్పంచ్ వసుంధర అన్నారు. మండలపరిధిలోని పెంజర్ల గ్రామంలో రైతు బంధు వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు రైతు బంధు వారోత్సవాలపై వ్యాసరచన, ఉపన్యాస, ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అంజమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, మండల ఉపాధ్యక్షుడు దామోదర్రెడ్డి, నాయకులు భీమయ్య, జగదీశ్వర్రెడ్డి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు
కేశంపేట : కేశంపేట, పాపిరెడ్డిగూడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాండ్ర విశాల, మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, ఏవో శిరీష, ప్రధానోపాధ్యాయులు రసూల్, వెంకటయ్యగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.