ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ఉపాధిహామీ పథకం కింద నిర్మించుకున్న కల్లాలపై కేంద్ర సర్కార్ చూపిస్తున్న వక్రబుద్ధిపై ఉమ్మడి జిల్లా రైతాంగం మండిపడుతున్నది. సరైన స్థలం లేక రైతులు రోడ్లపైనే వడ్లను ఆరబోస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో రాష్ట్ర సర్కార్ 2020 జూన్ నుంచి సిమెంట్ కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కొన్నిచోట్ల పనులు పూర్తయి అందుబాటులోకి రాగా, చాలా గ్రామాల్లో ఆయా దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర వివక్ష ధోరణితో కల్లాల నిర్మాణానికి బ్రేక్ పడింది. ఉపాధిహామీ నిధులు కల్లాల నిర్మాణానికి వాడొద్దని కొర్రీలు పెట్టడంతో అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయి. దీంతో రైతులు ప్రస్తుతం తప్పని పరిస్థితుల్లో రోడ్లపైనే ధాన్యం ఆరబెడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు కల్లాల నిర్మాణానికి ఖర్చు చేసిన ఉపాధిహామీ నిధులను తిరిగి చెల్లించాలని రాష్ట్ర సర్కార్పై ఒత్తిడి తెస్తూ కేంద్రం రైతు సంక్షేమ వ్యతిరేకిగా మరోసారి నిరూపించుకుంటున్నది. తెలంగాణ రైతులపట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజా, రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర వైఖరిని నిరసిస్తూ శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నారు.
వికారాబాద్, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నదాతలపై కక్ష సాధింపు చర్యలకు నిరసనగా నేడు (శుక్రవారం) జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి నిరసన చేపట్టనున్నది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో జరుగనున్న ధర్నాలో జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతు లు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయరంగానికి ఇప్పుడిప్పుడే మంచి రోజులొచ్చాయి. ఇది చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కండ్లు మండుతున్నాయి. దీంతో రాష్ర్టానికి ఏదో రకంగా అన్యాయం చేస్తూ వస్తున్నది. మొన్నటివరకు ధాన్యాన్ని సేకరించమని రైతులకు అన్యాయం చేసిన ప్రధాని మోదీ ప్రభుత్వం తాజాగా కల్లాల నిర్మాణం వ్యవసాయానికి సంబంధం లేదంటూ కొత్త రాజకీ యం చేస్తూ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నది.
ఉపాధిహామీ పథకంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా వ్యవసాయ రం గానికి నిధులు ఖర్చు చేశారు. ఆ నిబంధన ప్రకార మే రైతులు కల్లాలను నిర్మించుకున్నారు. ఇది చూసి ఓర్వలేని మోదీ ప్రభుత్వం రైతులు నిర్మించుకున్న కల్లాల డబ్బులను తిరిగి వెనక్కి ఇవ్వాలని పేచీ పెడుతున్నది. అంతేకాకుండా కల్లాల నిర్మాణానికి ఇప్పటివరకు పెట్టిన ప్రతి పైసానూ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ పేర్కొంటున్నది. రాష్ట్రంలో కల్లాలపై ఖర్చు చేసిన రూ.151 కోట్లు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు. దీంతో జిల్లాలో ఎక్కడికక్కడ కల్లాల నిర్మాణం ఆగిపోయింది. తప్పనిసరి పరిస్థితు ల్లో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెట్టుకుంటు న్నారు. రోడ్లపై ధాన్యాన్ని ఆరబోయడం ద్వారా తర చూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో ఆ ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి పూనుకున్నది. వికారాబాద్ జిల్లాలో 2,769 కల్లాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటివరకు 435 కల్లాల నిర్మాణం పూర్తికాగా.. మరో 640 కల్లాల నిర్మాణం 50 శాతానికిపైగా పూర్తైంది. ఇప్పటివరకు కల్లాల నిర్మాణానికి రూ.4.29 కోట్ల నిధులను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఒక్కో కల్లం నిర్మాణానికి రూ.85 వేల చొప్పున ప్రభుత్వం వెచ్చించింది. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతి, వారి బాగు కోసం కల్లాలను నిర్మిస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం క ల్లాల నిర్మాణానికి అడ్డుపడుతున్నది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా చేపట్టనున్నారు.
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పిలుపునిచ్చారు. బషీర్బాగ్లోని కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 2022 వరకు రైతుల ఆదా యం రెట్టింపు చేస్తామని చెప్పి… ఎరువులు, చమురు ధరలు రెట్టింపు చేసి అన్నదాతల నడ్డి విరుస్తున్నదన్నారు. కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని కోరారు. మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు.
-విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్ర రైతులు దర్జాగా బతుకుతున్నారు. కల్లాల నిర్మాణంతో అన్నదాతలకు ధాన్యం ఆరబోత కష్టాలు తప్పాయి. ఇంతకుముందు రోడ్లు, అద్దె పడాల్లో వడ్లు ఎండబోసేవాళ్లం. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరిగేవి. మరోవైపు అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడేవాళ్లం. కల్లాల నిర్మాణం చేపట్టి రైతులకు మేలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం విషం చిమ్ముతున్నది. తెలంగాణ రైతులపై కేంద్రానికి ఎందుకింత కడుపు మంట. నేడు నిర్వహించే ఆందోళనల్లో రైతులమంతా స్వచ్ఛందంగా పాల్గొంటాం.
-చిలుకల బుగ్గరాములు, రైతు, ఇబ్రహీంపట్నం
సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే వ్యవసాయం పండుగలా మారింది. రైతులందరూ పంటలను సాగు చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. రైతులు రోడ్లపై ధాన్యాన్ని ఆరబోయడం ద్వారా పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. వాటిని అరికట్టేందుకు సీఎం కేసీఆర్ కల్లాల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అవి ఎంతో మం ది రైతులకు ఉపయుక్తంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న కోపం, కక్షతోనే కేంద్రంలోని మోదీ ప్ర భుత్వం రాష్ట్రంలో కల్లాలపై ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కేసీఆర్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేంద్రం తీరును నిరసిస్తూ నేడు జిల్లా కేంద్రంలో రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగనున్న ధర్నాకు అన్నదాతలు అధిక సంఖ్యలో హాజరై జయ ప్రదం చేయాలి.
-మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతున్నది. రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో కల్లాలను నిర్మిస్తున్నది. అది చూసి ఓర్వలేని మోదీ ప్రభుత్వం.. కోపం, కక్షతో కల్లాల నిర్మాణానికి వినియోగించిన డబ్బులను తిరిగి వెనక్కి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిం ది. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా రాష్ర్టాభివృద్ధికి అడ్డు తగులుతున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం దుష్ర్పచారాన్ని నిరసిస్తూ నేడు జిల్లా కేంద్రంలో జరుగనున్న ధర్నాకు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలి.
-వంగేటి లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు వడ్లను ఆరబెట్టుకునేందుకు కల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కేంద్రం దగ్గర డబ్బులు అయిపోతాయనే చందంగా కేం ద్రంలోని మోదీ ప్రభుత్వం వ్యవహరించడం న్యాయంగా లేదు. కేంద్రం రైతుల పట్ల అన్యా యంగా వ్యవహరిస్తున్నది. కల్లాల ఏర్పాటుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నది.
– నందిపేట రాములు రైతు, కొండాయపల్లి గ్రామం, దోమ మండలం
ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో రైతులు ఉపాధిహామీ పథకం కింద సిమెంటు కల్లాలను ఏర్పాటు చేసు కున్నారు. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను కల్లాలకు వినియోగించొవద్దంటూ పేర్కొనడం సరైన పద్ధతి కాదు. దీంతో గ్రామాల్లో నిర్మాణ పనులు ఆగిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. కొన్ని సార్లు ప్రమా దాల బారిపపడుతున్నారు.
– రైతు మల్గాస్ అనంతయ్య, తిమ్మాయిపల్లి గ్రామం, దోమ మండలం