కేశంపేట : రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రవీందర్యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం కేశంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులు పండించిన మొక్కజొన్న పంటను రెండు నెలల కిందట సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి.. ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదన్నారు. పంటను అప్పులు చేసి అన్నదాతలు సాగు చేశారని.. డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మండలంలో 561 మంది రైతులకు దాదాపు రూ.6 కోట్ల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు.
నాలుగు రోజుల్లో డబ్బులు చెల్లించకుంటే మండల కేంద్రంలో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీధర్రెడ్డి, షాద్నగర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణగౌడ్, పీఏసీఎస్ కొత్తపేట మాజీ చైర్మన్ జగదీశ్వర్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు వేణుగోపాల్చారి, రాజు, రమేశ్యాదవ్, మాజీ సర్పంచ్లు నవీన్కుమార్, వెంకట్రెడ్డి, తిరుమల్రెడ్డి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ మల్లేశ్యాదవ్, నాయకులు సురేందర్, పర్వత్రెడ్డి, అశోక్, జమాల్ఖాన్, సాజిద్, జగన్రెడ్డి, మన్మథరెడ్డి, ప్రేమ్కుమార్గౌడ్ పాల్గొన్నారు.