షాబాద్, మార్చి 28: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. గ్రామా లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు, వృద్ధులు అధిక సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. మంగళవారం చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వ రం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా 13,505 మందికి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించగా.. అందులో 963 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. 809 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. గ్రామాల వారీగా కేటాయించిన రోజుల్లో వైద్య బృందాలు ముందస్తు సమాచారాన్ని ప్రజలకు అందించి ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు అవసరమైన వారికి అద్దా లు, మందులను పంపిణీ చేస్తున్నారు. ఆయా మం డలాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపులను ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో మంగళవారం వైద్య సిబ్బంది 5,372 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. అందులో 723 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. 711 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 271 గ్రామాలు, 57 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను పూర్తి చేసినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
అద్దాలు, మందులు తీసుకున్నా..
కంటి వెలుగు కార్యక్ర మం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ది. ఇది వరకు కంటి పరీక్షలు చేయించుకునేందు కు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. పేదల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల్లోనే కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయించి ఉచితంగా పరీక్షలతోపాటు అవసరమైన వారికి మందులు, అద్దాలను పంపిణీ చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా మా గ్రా మంలో ఏర్పాటు చేసిన శిబిరంలో పరీక్షలు చేయించుకోగా వైద్యులు నాకు అద్దాలు, మందు లు ఇచ్చారు.
– ఎ.అంజయ్య, కమ్మెట గ్రామం, చేవెళ్ల మండలం