ఖమ్మం కమాన్బజార్, ఆగస్టు 3: ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదన్న ఆవేదనతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన నిరుద్యోగి వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యకు యత్నించాడు. అతడి కుటుంబానికి ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు నామా ట్రస్ట్ ద్వారా రూ.50వేల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ చెక్కును ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ కమల్రాజు, బీఆర్ఎస్ నాయకులు సోమవారం వేణుకుమార్కు అందజేశారు.