అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నిరుదోగ్యులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. నిన్న ఏపీపీఎస్సీ (APPSC )ద్వారా 892 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా తాజాగా 2050 ఎస్సై ( SI ), కానిస్టేబుల్ ( Constable ) పోస్టులకు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ( Notification ) విడుదల చేసింది. ఎస్సై విభాగంలో సివిల్ 253, ఏఆర్ కానిస్టేబుళ్ల పోస్టులు 116, ఎస్పీఎఫ్ 09, కమ్యూనికేషన్ 50 పోస్టులు, పీటీవో 10 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.
కానిస్టేబుల్ విభాగంలో 542 సివిల్, 285 ఏఆర్,ఫైర్ 158, జైలు వార్డర్ పురుషులు 150, జైలు వార్డర్ మహిళలు 21 , కమ్యూనికేషన్ 200, పీటీవీ విభాగంలో 15 మెకానిక్స్, 198 డ్రైవర్, 43 సెంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు బోర్టు నోటిఫికేషన్ విడుదల చేయగా రాత పరీక్ష తేదీల వివరాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది.