కొడంగల్ : కంటి చూపుపై ఆశ్రద్ధ వహించవద్దని కంటి చూపు సక్రమంగా ఉన్నప్పుడే ఒకరిపై ఆధారపడకుండా జీవించే ఆస్కారం ఉంటుందని, లేదంటే జీవితం అంధకారంలో ఉండిపోతుందని కొడంగల్ లయన్స్క్లబ్ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్, చైర్మన్ డీసీబీఎస్, కందూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి ఎనుగొండ, కొడంగల్ లయన్స్క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో ఎంతోమందికి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు శస్త్రచికిత్సలను నిర్వహించినట్లు తెలిపారు.
కంటి శస్త్రచికిత్సలు అనగానే భయపడాల్సిన అవసరం లేదని, నేటి ఆధునిక యుగంలో అత్యాధినికమైన పరికరాలు అందుబాటులో ఉండటం వల్ల కేవలం 10నుంచి 15నిమిషాల్లోనే శస్త్రచికిత్స పూర్తి కాబడుతుందని తెలిపారు. శస్త్రచికిత్స నిర్వహించుకున్న వారు కనీసం నెల రోజుల పాటు వైద్యులు సూచనలు పాటిస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. బుధవారం నిర్వహించిన ఉచిత క్యాంపులో మొత్తం 123మంది హాజరు కాగా వీరిలో 25 మందికి కంటి శుక్లాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఆప్తామలాజీ అధికారి లయన్ హరినాథ్నెహ్రూ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా ఎనుగొండ కందూరు రాంరెడ్డి లయన్స్క్లబ్ కంటి ఆసుపత్రికలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించి ఉచితంగా మందుల అందించడంతో పాటు కంటి అద్దాలను అందిచడం జరుగుతుందన్నారు.
అనంతరం కంటి పరీక్షలకు హాజరైన వారికి పండ్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశిష్ట అతిథి ఎన్ఆర్ఐ లయన్ సుచిత్రెడ్డి, సభ్యులు శివకుమార్గుప్తా, ప్రభాకర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, వైద్యుడు డా. గోపాల్ పాల్గొన్నారు.