మత్స్యకారుల ఆర్థిక ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. వారి జీవనోపాధి కోసం ఏటా ఉచితంగా చేప పిల్లలను అందజేస్తూ చేయూతనందిస్తున్నది. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలోని 804 చెరువుల్లో 1.96 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 26వ తేదీన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇబ్రహీంపట్నం చెరువులో చేప విత్తనాలను విడుదల చేసి, లాంఛనంగా ‘నీలి విప్లవం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే చేపల వేటకు సంబంధించిన వలలు, ద్విచక్ర, టాటా ఏస్ వాహనాలు తదితర వాటిని అందించి బతుకుపై భరోసా కల్పించిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలోని 161 మత్స్యకార సంఘాల పరిధిలోని 8,221 కుటుంబాలకు ఏడాదంతా ఉపాధి లభించనున్నది.
– రంగారెడ్డి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): విస్తారంగా వర్షాలు కురువడంతో జిల్లాలోని అన్ని చెరువుల్లోకి సమృద్ధిగా నీరు చేరడంతో నిండుకుండల్లా మారా యి. ఇదే సానుకూలతతో నీటి వనరుల్లో చేపల పెంపకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. నీలి విప్లవం పేరుతో ప్రతి యేటా ఉచితంగా చేపపిల్లలను నీటివనరుల్లో వదులుతున్న ప్రభు త్వం ఈసారి కూడా చేపల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. జిల్లా వ్యాప్తంగా చేపల పెంపకానికి అనువుగా ఉన్న 120 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 684 చెరువుల్లో 1.96 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఓ వైపు సమీకృత అభివృద్ధి పథకం కింద మత్స్యకారుల ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తూనే.. చేపపిల్లలను ఉచితం గా అందించి ఉపాధిని సైతం కల్పిస్తున్నది. ఈనెల 26న ఇబ్రహీంపట్నం చెరువులో రాష్ట్ర మత్య్స శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చేప పిల్లలను వదిలి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత విడుతల వారీగా చెరువు ల్లో చేపపిల్లలను అధికారులు వదులనున్నారు. కా గా జిల్లాలో మత్స్యకారుల సంఘాలు 161 ఉండ గా.. అందులో సభ్యులు 8,221 మంది ఉన్నారు.
జలాశయాల్లో ఉచితంగా బొచ్చ, బంగారు తీగ, రొయ్య, ముల్లంగి తదితర చేపపిల్లలను వదులుతు న్న నేపథ్యంలో జిల్లాలో మత్స్య ఉత్పత్తి సైతం గణ నీయంగా పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో మత్స్యకారుల కుటుంబాలు కూడా ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నాయి. చేపల వేటతో రూ.కోట్లకు పైగా ఆదాయాన్ని వారు ఆర్జిస్తున్నారు. ఒక్కో సభ్యుడు సీజన్లో సగటున రూ. 1.50లక్షల నుంచి రూ.2లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు. జిల్లాలో ఉత్పత్తి అవుతున్న చేపలు ఇతర రాష్ర్టాల కూ ఎగుమతి అవుతున్నాయి. దీంతో చేపలను వి క్రయించేందుకు మార్కెటింగ్ సౌకర్యం క ల్పించేం దుకు మత్స్యశాఖ చర్యలు తీసుకుంటున్నది.
మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. చేప పిల్లలను వేటాడేందుకు వలలు, రవాణా కో సం ద్విచక్ర వాహనాలు, లగేజీ ఆటోలు, బొలెరో వాహనాలను కూడా అందిస్తున్నది. అదేవిధంగా మహి ళా సహకార సంఘాలకు రు ణాలను సైతం విరివిగా పంపిణీ చేస్తున్నది. ఫిష్ ఫుడ్ ఫెష్టివల్ కా ర్యక్రమాలను నిర్వహించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నది. నీలి విప్లవం పేరుతో తెలంగా ణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మత్స్యకారు ల కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నాయి.
జిల్లాలో 120 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 684 చెరువులున్నాయి. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో భారీ వర్షాలు కురియడంతో జిల్లాలోని అన్ని జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టాలతో కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా 1.96 కోట్ల చేప పిల్లలను వదులనున్నారు. అందు లో 28 లక్షల చేపపిల్లలను పెద్ద చెరువుల్లోకి మరో 1.68 కోట్ల చిన్న చేపపిల్లలను చిన్న, చిన్న నీటి వనరుల్లోకి వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చేప పిల్లల కొనుగోళ్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తికాగా ఇందుకోసం రూ.1.33 కోట్లను ప్రభు త్వం వెచ్చిస్తున్నది. ఇందులో పెద్ద చేప పిల్లల కో సం రూ.40.60లక్షలు, చిన్న చేపపిల్లల కోసం రూ. 92.40 లక్షలను ఖర్చు చేస్తున్నది.