వికారాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): వేసవి కాలం ప్రారంభమైన దృ ష్ట్యా వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా అటవీశాఖ అధికారులు చర్య లు చేపట్టారు. రోజురోజుకూ ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వాటికి ప్రాణా పాయం లేకుండా వికారాబాద్ రేంజ్తోపాటు మిగతా అన్ని రేంజ్ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో 108 సాసర్ పిట్లను ఏర్పాటు చేశారు.
వాటిలో రెండు రోజు లకొకసారి నీటిని నింపి దప్పికను తీర్చుతున్నారు. గతంలో వన్యప్రాణులు దా హం తీర్చుకునేందుకు పూడూరు మండలంలోని సోమన్గుర్తి గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలోకి దిగి మృతిచెందిన ఘటనతోపాటు అదే మండలంలోని దామగుండం కోనేరులో పడి జింకలు మృత్యువాత పడిన ఘటనలున్నాయి.
అయితే ఇలాంటివి జరుగకుండా జిల్లా అటవీశాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అయితే జిల్లాలో మొత్తం 108 సాసర్ పిట్లను ఏర్పాటు చేయగా అందులో …వికారాబాద్రేంజ్ పరిధిలోని అనంతగిరి, దామగుండం, కండ్లపల్లి, జైదుపల్లి, గట్టుకొండాపూర్, మోత్కుపల్లి, ఎక్మామిడిలోని అటవీ ప్రాంతాల్లో 31 సాసర్పిట్లు.. ధారూరు రేంజ్ పరిధిలో 14, కొడంగల్ రేంజ్ పరిధిలో 11 , పరిగి రేంజ్ పరిధిలో 30, తాండూరు రేంజ్ పరిధిలో 22 సాసర్ పిట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పలు అటవీ ప్రాంతాల్లో ఉన్న ఏడు సోలార్ బోర్ల ద్వారా కూడా సాసర్ పిట్లను నింపి అటవీ జంతువులు దాహార్తిని తీరుస్తున్నారు. మరోవైపు జిల్లాలోని అడవుల్లో 100కు పైగా జింకలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఆగని వన్యప్రాణుల వేట, రోడ్డు ప్రమాదాలు..
మరోవైపు జిల్లాలో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. ఓ వైపు వేటగాళ్ల రూపంలో.. మరోవైపు రోడ్డు ప్రమాదాలతో మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతానికి సమీపంలో భూములు కొనుగోలు చేసి ఫాంహౌస్లను ఏర్పాటు చేసుకున్న కొందరు వారాంతపు సెలవుల్లో రాత్రి సమయాల్లో జింకలను వేటాడుతూ.. వాటి మాంసంతో ఫాంహౌస్ల్లో పార్టీలు చేసుకుంటు న్నారని సమీప గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
అప్రమత్తమైన అటవీశాఖ అధికా రులు రాత్రి వేళ్లలో వేటగాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినా.. తదనంతరం పర్యవేక్షణ కొరవడి మళ్లీ వేట సాగుతూనే ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవై పు రోడ్డు ప్రమాదాల్లోనూ వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. రాత్రి సమయాల్లో రోడ్డు దాటే సమయంలో వాహనాలు ఢీకొని అవి మృతి చెందుతున్నాయి. ఇటీవల అనంతపద్మనాభ ఆలయం సమీపంలో రోడ్డు దాటుతున్న జింకను మొబైల్ ఫోన్లో చిత్రీకరించే క్రమంలో రోడ్డు ప్రమాదమై జింక మృతి చెందింది. వన్యప్రాణులు రోడ్డు దాటే వరకు వాహనాలను నిలిపివేయాలని అధికారులు సూచిస్తున్నారు.
రెండు రోజులకొకసారి సాసర్ పిట్లను నింపుతున్నాం.
జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు 108 సాసర్ పిట్లను ఏర్పాటు చేశాం. అంతేకాకుండా రెండురోజులకొకసారి వాటిలో ట్యాంక ర్ల ద్వారా నీటిని నింపుతున్నాం. అటవీ జంతువుల తాగునీటికి ఎలాంటి ఇబ్బం ది లేదు. మరోవైపు అటవీ జంతువులు రోడ్డు దాటే సమయంలో వాహనదారు లు నెమ్మదిగా వెళ్లడం లేదా వాహనాన్ని నిలిపివేయాలి. అనంతగిరి అటవీ ప్రాంతం గడ్డి భూములకు ప్రత్యేకం కావడంతో సిగరెట్లు ఇతరత్రా తాగి ఆర్పకుండా కింద పడేయొద్దు.
– జ్ఞానేశ్వర్, వికారాబాద్ డీఎఫ్వో