రంగారెడ్డి, నవంబర్ 19( నమస్తే తెలంగాణ): తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలు జనాలు లేక వెలవెల బోతున్నాయి. ఓట్ల కోసం మాయమాటలు చెప్పేవారిని ప్రజలు నమ్మడం లేదు.
ఆదివారం చేవెళ్లలోని కేవీఆర్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకాగా, జనం లేక అట్టర్ ఫ్లాప్ అయ్యింది. జన సమీకరణకు బీజేపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నడ్డా.. ప్రసంగంలో కొత్తదనం కొరవడడంతో వచ్చిన కొద్దిమంది సైతం మధ్యలోనే వెళ్లిపోయారు.