శంకర్పల్లి జూన్ 14 : నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన కు కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మంగళవారం శంకర్పల్లి మున్సిపాలిటీ నిధులు 16.80 లక్షల రూపాయాలతో కొనుగోలు చేసిన వైకుంఠ రథాన్ని మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తుందన్నారు. పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందాయని కొనియాడారు.
కార్యక్రమంలో కమిషనర్ యాదగిరి, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వాసుదేవ్కన్నా, కౌన్సిలర్లు శ్వేత,చంద్రమౌళి,లక్ష్మమ్మ, శ్రీనాథ్ ,గోపాల్, కో ఆప్షన్ సభ్యుడు వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ యూత్ అద్యక్షుడు పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.