వికారాబాద్, ఫిబ్రవరి 5 : వికారాబాద్ మున్సిపాలిటీలోని వార్డుల అభివృద్ధి కాం గ్రెస్ ప్రభుత్వానికి చేతకాదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనం ద్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మున్సిపాలిటీలోని 9, 13, 14 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. వృద్ధులను కలిసి పింఛన్లపై చర్చించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 25 నెలలు దాటినా స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు వికారాబాద్కు రూపాయీ నిధులను తీసుకురాలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయామని.. ఇప్పుడు మోసపోకుండా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
తొమ్మిదో వార్డులో అభ్యర్థి మమత ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో 9వ వార్డు అభ్యర్థి మమతాఅంజి, 13వ వార్డు హరిప్రియాప్రశాంత్, 14వ వార్డు జ్యోతి, మండలాధ్యక్షుడు గోపాల్ముదిరాజ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, మాజీ కౌన్సిలర్ పావని, అనంత్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.