దౌల్తాబాద్ : మండల కేంద్రానికి చెందిన ఓ యువతి అనుమానాస్పదంగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ ముతారాజు తెలిపిన వివరాలు ప్రకారం.. నవిత (15) రేషన్ షాప్కు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్లి సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మంగళవారం దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
బుధవారం చెరువులో నవిత శవమై తెలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.