షాబాద్, ఏప్రిల్ 26: అర్హులైన లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇండ్లను అందజేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జిల్లాలోని డబుల్ బెడ్రూం ఇండ్ల పనులపై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన బృహత్తర కార్యక్రమమే డబుల్ బెడ్రూం ఇండ్ల పథకమని తెలిపారు. పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇండ్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు ముందుకు రాని చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలను అమలు చేయాలన్నారు. ఇండ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలైన రోడ్డు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, ఆర్డీవోలు వెంకటచారి, రాజేశ్వరి, వేణుగోపాల్, సూరజ్, పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.