సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తృతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జీలను సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
వచ్చే మూడు, నాలుగు నెలల పాటు పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా తీసుకోవడం, శ్రేణులను ఏకం చేసేలా ఆత్మీయ సమ్మేళనాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రతినిధుల సభ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలను ఇన్చార్జీలు సమన్వయం చేయనున్నారు. జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యేలతో ఆయా కార్యక్రమాలను అమలు చేయనున్నారు.