శంకర్పల్లి, ఫిబ్రవరి 23: ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గుదిబండలా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు తాహెర్ అలీ కోరారు. శుక్రవారం సీపీఎస్ సంఘం సభ్యులతో కలిసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్రెడ్డిలను కలిసి హైదరాబాద్లో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్ను రద్దు చేసి 1980 రూల్స్ ప్రకారం పాత పెన్షన్ పద్ధతిని అమలు చేయాలని కోరారు. అన్ని రాష్ర్టాలు సీపీఎస్ను రద్దు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో సీపీఎస్ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎస్ సంఘం సభ్యులు నాగవెళ్లి, ఉపేందర్, దర్శన్ గౌడ్, సురేందర్సింగ్, పంకజ్రెడ్డి, రవికిరణ్, విజయ్, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.