కులకచర్ల, మార్చి 1 : పంటల వివరాలను ఏఈవోల ద్వారా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ రైతులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామంలో పంటలను పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఆన్లైన్లో నమోదు చేయించుకున్న రైతులకు మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఏఈవోలు తప్పని సరిగా పంటలను పరిశీలించాలని ఆదేశించారు. ఆయన వెంట కులకచర్ల మండల వ్యవసాయాధికారి వీరస్వామి, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.