ధారూరు, జనవరి 10: రైతులు సాగు చేసిన పంటలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలోని వేరుశనగ, వరి నారును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు యాసంగిలో సాగు చేసే పంటలు వేరుశనగ, మక్కజొన్న, కూరగాయలు తదితర పంటలను వ్యవసాయ విస్తరణ అధికారులతో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు సంజువ్రాథోడ్, తైలోక్య, రైతులు వెంకటయ్య, ఉలేందర్ ఉన్నారు.