వికారాబాద్, మే 18 : యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందు లు కలుగకుండా అన్ని విధాల మౌలిక సదుపాయాలతో జిల్లాలో 111 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రైతులకు ఎటువంటి సమాచారం కావాల్సివచ్చినా, ఏమైన సమస్యలు ఉన్నా జిల్లా పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన 9063373379, 9791 151865, 6305725220 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.