ప్రజా శ్రేయస్సును కోరే బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మ్యానిఫెస్టోను రూపొందించింది. రాష్ట్రం రాక ముందు ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల బియ్యమే ఇచ్చేవారు. అవి దొడ్డు బియ్యం.. నూకలు కలిసినవి, మెరిగలు, మట్టి పెడ్డలుండేవి. వండుకుంటే ముద్ద అన్నం.. తినే పరిస్థితి ఉండేదికాదు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి ఒక్కొక్కరికీ ఆరుకిలోల చొప్పున నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. రంగారెడ్డి జిల్లాలో 5.58లక్షల తెల్లరేషన్ కార్డులుండగా, 919 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెలా 11,631 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ కార్డుదారులందరికీ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే సన్నబియ్యం పంపిణీ జరుగనున్నది. ఇప్పటికే స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడీల్లో సన్నబియ్యం భోజనం పెడుతుండగా, పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలన్న నిర్ణయానికి బీఆర్ఎస్ను గెలిపించుకుని తీరుతామంటూ జనం జేజేలు పలుకుతున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు సబ్బండ వర్ణాలు జేజేలు పలుకుతున్నాయి. పేదల పక్షపాతిగా సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నాయి. తెలంగాణ అన్నపూర్ణ పథకంతో పేదలందరికీ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న ది. జిల్లాలో 5,58,664 తెల్లరేషన్ కార్డుదారులుండగా ..ప్రతినెలా షాపుల ద్వారా బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది. స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడీలకు పంపిణీ చేస్తున్న రీతిలోనే ఇకపై పేదలకు కూడా రేషన్ షాపుల ద్వారానే సన్నబియ్యాన్ని అందిస్తామని ప్రకటించడం పేదల పాలిట వరంగా మారింది. మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి పథకంలోనూ మానవీయ కోణం ఆవిష్కృతమవుతుండడంతో బీఆర్ఎస్ను గెలిపించి తీరుతామని ప్రజానీకం ప్రతినబూనుతున్నది.
ఆహార భద్రతా కార్డుల ద్వారా గతంలో ప్రతి వ్యక్తికీ గతంలో నాలుగు కిలోల బియ్యాన్ని మాత్రమే ఇచ్చేవారు. కుటుంబ స భ్యుల సంఖ్య ఐదుగురికి మించితే గరిష్ఠంగా 20 కిలోల బి య్యం మాత్రమే ఒక్క కార్డుపై ఇచ్చేవారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆ పరిమితిని తొలగించారు. ప్రతి వ్యక్తికీ ఇచ్చే బియ్యం కోటాను 6 కిలోలకు పెంచడమే కాకుండా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికీ ఆరుకిలోల చొప్పున రేషన్ కార్డుపై పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 5,58,664 మంది తెల్లరేషన్ కార్డులందరికీ 919 రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా 11,631మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. పేదలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ సన్నబియ్యం బువ్వ పెట్టాలని నిర్ణయించారు. ‘అన్నపూర్ణ’ద్వారా తెల్లరేషన్ కార్డులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ఆయన ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. ఈ పథకంతో ప్రభుత్వంపై ఆర్థి క భారం పడుతున్నప్పటికీ సీఎం మానవీయ కోణంలో ఆలోచించి సన్నబియ్యం పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం బువ్వను ప్రభుత్వం అందిస్తున్నది. అలాగే హాస్టళ్లల్లో చదువుకుంటున్న వారికి, అంగన్వాడీ కేంద్రాలకొస్తున్న వారికీ సన్న బియ్యం బువ్వను పెడుతున్న ది. ఇది ఎన్నికల హామీ కానప్పటికీ చిన్నారుల భవిష్యత్తు కు భరోసా కల్పించేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యార్థులకే పరిమితమైన సన్నబియ్యం పంపిణీ ఇకపై పేదలందరికీ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొనడంతో బీఆర్ఎస్ ప్రభుత్వాని కి అండగా ఉంటామని అన్నివర్గాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రజలను కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. స్వరాష్ట్ర ఫలాలను నిరుపేదలకు అందించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచిన వెంటనే పేదలకు సన్నబియ్యం అందిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించడం అభినందనీయం. తెలంగాణ వచ్చిన తర్వాతే పేదల బతుకులు మారాయి. పేదల పాలిట దేవుడు సీఎం కేసీఆర్.
-పాండూనాయక్, కడ్తాల్ మండలం
సంక్షేమ పథకాలను అమలు చేసే సత్తా సీఎం కేసీఆర్కే ఉన్నది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని ఎన్నో హామీలను కూడా ఆయన ప్రవేశపెట్టి అమలు చేశారు. రేషన్ కార్డు ఉన్న వారికి ఎన్నికల్లో గెలిచిన వెంటనే సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని ఇచ్చిన హా మీ ఎంతో సంతోషాన్నిచ్చింది. కేసీఆర్ హామీ ఇచ్చారంటే కచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకం ఉన్నది.
-పొట్ట వెంకటయ్య, బొంరాస్పేట
ధనికులతోపాటు పేదలు కూడా సన్నబియ్యం తినాల నే ఉద్దేశంతో ఎన్నికల్లో గెలిచిన వెంటనే పేదలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞ తలు. ఆయన అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ర్టాభివృద్ధికి కేసీఆర్తోనే సాధ్యం.
-లక్ష్మి, ఎన్కతల, మోమిన్పేట
అన్నపూర్ణ పథకం పేదల పాలిట వరంగా మారనున్నది. సీఎం కేసీఆర్ పార్టీ మ్యానిఫెస్టోలో గెలిచిన వెంటనే పేదలకు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించడం సంతోషకరం. ఇప్పటికే ఆయన పేదలకు ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున సరఫరా చేస్తున్నారు. రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కే నా ఓటు.
-దుర్గయ్య, టేకులపల్లి, మోమిన్పేట
సీఎం కేసీఆర్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో గెలిచిన వెంటనే పేదలకు సన్నబియ్యాన్ని అందిస్తామని మ్యా నిఫెస్టోలో ప్రకటించటం సంతోషకరం. సన్నబియ్యా న్ని పంపిణీ చేస్తామని ప్రకటించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-చెరుకూరి మంగ, పోల్కంపల్లి, ఇబ్రహీంపట్నంరూరల్
సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు. పేదలకు సన్నబియ్యాన్ని అందించాలని నిర్ణయించడం చాలా సంతోషకరం. పేద, మధ్యతరగతి ధనికులు అనే తేడాలు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా పథకాలకు శ్రీకారం చుట్టడం గొప్ప విషయం.
-అనిల్, షాద్నగర్
త్వరలో జరుగనున్న ఎన్నికల్లో గెలిచిన వెంటనే రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించడం చాలా సంతోషకరం. దీని ద్వారా పేదలకు ఆర్థిక భా రం తప్పుతుంది. త్వరలో జరుగనున్న ఎన్నికల్లోనూ కేసీఆర్కే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.
– సుభద్ర, గృహిణి రాంపూర్ తలకొండపల్లి
షన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తే పేదలంతా కడుపు నిండా భోజనం చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో సన్నబియ్యం రూ.50 పైనే విక్రయిస్తున్నారు. అందువల్ల చాలామంది వాటిని కొనుగోలు చేయడంలేదు. రేషన్ షాపుల ద్వారా అందిస్తే వారికి ఎంతో సౌలభ్యంగా ఉం టుంది. సీఎం కేసీఆర్ పేదలను ఉద్దేశించే నిర్ణయాలు తీ సుకుంటారు. ఆయన నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.
-ముడవత్, గబ్రూచౌహాన్, చాకలిగుట్టతండా
అర్హులైన వారందరికీ రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. సీఎం సారు మంచిగా ఉండాలి. ఇలాంటి పథకం మునుపెన్నడూ చూడలేదు. ప్రజల కోసం ప్రవేశపె డుతున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్రే మళ్లీ సీఎం కావాలి.
-చీపిరి అంజమ్మ, సోలిపూర్ షాద్నగర్
తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం పేదలకు గొప్ప వరం. ఇలాంటి మంచి పథకాలను ప్రవేశపెట్టాలంటే గుండె ధైర్యం, దిల్ ఉండాలె. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగితున్నది.
-సామ విఠల్రెడ్డి, దేవునిఎర్రవల్లి, చేవెళ్ల
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో గెలిచిన వెంటనే పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరం. ప్రభుత్వ పథకాలే గెలుపునకు బాటలు వేస్తాయి. సన్నబియ్యం పంపిణీ మంచి నిర్ణయం.
-సోఫియాబేగం,హాజీపూర్, యాలాల
పేదలకు కడుపునిండా అన్నం పెట్టేందుకు సీఎం కేసీఆర్ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం సంతోషకరం. ఇప్పటికే రేషన్కార్డులో ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం …మళ్లీ అధికారంలోకి రాగానే అన్నపూర్ణ పథకం ద్వారా ప్రతి కుటుంబానికీ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పడం హర్షనీయం. ఎప్పుడూ సీఎం కేసీఆర్ వెంటే ఉంటా.
-కారు చెన్నయ్య, బోడంపహాడ్, షాబాద్
రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా సంతోషకరం. ఇక నుంచి అన్ని వర్గాల వారు సన్నబియ్యం అన్నం తినే అవకాశం లభిస్తుంది. ప్రతినెలా వచ్చే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల ఎన్నో పేద కుటుంబాలకు మేలు జరుగుతుంది.
-జాల అమృత, పెద్దఅంబర్పేట
రేషన్కార్డు ఉన్న వారికి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం పేదలకు ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం తెల్ల రేషన్కార్డులో ఎంతమంది పేర్లుంటే అంతమందికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసి కడుపునిండా తిండి పెడుతున్నది. దీంతో నిరుపేదలకు ఎంతో లబ్ధి కలుగుతున్నది.
-చాకలి చంద్రయ్య, ఏర్పుమళ్ల, బొంరాస్పేట
పేదల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు అందరం అండగా ఉండాలి. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పేదల కోసం ఇలాంటి మంచి పథకాలను ఎప్పుడూ అమలు చేయలేదు. రేషన్ కార్డులున్న పేదలకు ఒక్కొక్కరికీ ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం.. మూడో సారి కూడా అధికారంలోకి రాగానే సన్నబియ్యం సరఫరా చేస్తామని ప్రకటించడం ఎంతో బాగుంది. కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయం. ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు.
-పగుడాల శేఖర్రెడ్డి, గొల్లూరుగూడ, షాబాద్
రేషన్ కార్డు ఉన్న వారికి ఎన్నికల్లో గెలిచిన వెంటనే సన్న బియ్యాన్ని అందిస్తామని సీఎం కేసీఆర్ పార్టీ మ్యానిఫెస్టో లో పొందుపర్చడం పేదలకు వరం లాంటిది. గత ఉమ్మ డి ప్రభుత్వాల పాలనలో ఇంత మంచి పథకాలను ఎప్పుడూ అమలు చేయలేదు. ప్రజలకు సీఎం కేసీఆర్ అంటే ఎంతో నమ్మకం ఉన్నది.
-మల్లెల ఉపేందర్, ఇంజాపూర్, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ
రేషన్ కార్డుపై సన్న బియ్యం ఇస్తామని సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టడం హర్షనీయం. ఇది పేదలకు వరం లాంటిది. పేదలంతా నాణ్యమైన సన్నబియ్యంతో కడుపునిండా భోజనం చేయాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. ఇది పేదల ప్రభుత్వం. ఆయనకు తెలంగాణ ప్రజానీకం అండగా నిలువాలి.
రాష్ర్టాభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ప్రజలంతా సీఎంకు అండగా ఉండి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి.
-ఎదిరె మల్లేశ్, దేవునిఎర్రవల్లి గ్రామం, చేవెళ్ల