షాబాద్, మే 12 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నది. చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన 80 శిబిరాల్లో వైద్య బృందాల సభ్యులు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవా రం 11,192 మందికి కంటి పరీక్షలు చేశా రు. అందులో 410 మందికి అద్దాలు పం పిణీ చేయగా.. 379 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఆయా మం డలాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను జిల్లా, డివిజన్ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు కలుగకుండా కంటి పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచిస్తున్నారు.
బొంరాస్పేట, మే 12 : వికారాబాద్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. జిల్లాలో ఏర్పా టు చేసిన 42 కేంద్రాల్లో వైద్యులు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అప్పటికప్పుడే అవసరమున్న వారికి మందులతోపాటు కంటి కద్దాలను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం జిల్లాలో 5,312 మందికి కంటి పరీక్షలు చేయగా.. అందులో 485 మందికి అద్దాలను పంపిణీ చేశారు. 523 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం వైద్యులు ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 439 గ్రామాలు, 84 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించినట్లు వైద్యాశాఖ అధికారులు తెలిపారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
కంటి వెలుగు కార్యక్రమంతో పేదల కంటి సమస్యలు దూరమవుతున్నాయి. ఇంత మం చి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అప్పటి పాలకులు ప్రజల సమస్యలను ఎప్పుడూ పట్టించుకోలేదు. ప్రస్తుతం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న శిబిరాల్లో ప్రజలను పరీక్షిస్తున్న వైద్యులు అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలను పంపిణీ చేయడం చాలా బాగుంది. నేను కూడా మా ఊరిలో ఏర్పాటు చేసిన శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకుని.. అద్దాలు, మందులు తీసుకున్నా.
-పార్వతమ్మ, దేవునిఎర్రవల్లి గ్రామం, చేవెళ్ల మండలం