చేవెళ్ల టౌన్, ఏప్రిల్ 17 : కులమతాలకు అతీతంగా రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ కానుకలను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. దేశంలో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ పండుగలను పరస్పరం గౌరవించాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవరావు, వ్యవసాయ మార్కెట్ కమటీ చైర్మన్ మిట్ట వెంకటరంగారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, సర్పంచ్లు బండారి శైలజ అగిరెడ్డి, ప్రభాకర్, మాజీ సర్పంచ్ జంగారెడ్డి, శ్రీనివాస్, నర్సింలు, శివారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సింలు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మాణిక్యం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తెలుగు వెంకటేశ్, ఫయాజ్, మాజీ డైరెక్టర్ అబ్దుల్ గని, సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి, కుంచం శివకుమార్ ఉన్నారు.
శంకర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో..
శంకర్పల్లి ఏప్రిల్ 17 : మండల పరిషత్ కార్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం అందజేసిన రంజాన్ తోఫాలను ఎమ్మెల్యే కాలె యాదయ్య సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, శంకర్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్, ఏఎంసీ చైర్మన్ పాపారావు, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రవీందర్గౌడ్, సర్పంచ్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్ శ్రీనాథ్, చంద్రమౌళి, అశోక్, తహసీల్దార్ నయీమొద్దీన్, ఎంపీడీవో వెంకయ్య, గోపాల్ పాల్గొన్నారు.