తలకొండపల్లి, డిసెంబర్ 13 : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నిర్మల అధ్యక్షతన మండలంలోని 81 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది పేదలు తమ ఆడబిడ్డల పెండ్లి చేయడానికి పడుతున్న ఇబ్బందులను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపట్టారని గుర్తు చేశారు. వచ్చే రెండేండ్లలో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. రూ.22 కోట్లతో కడ్తాల్ నుంచి తలకొండపల్లి వరకు డబుల్ రోడ్డుతో పాటు అనేక అబివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
దవాఖానను సందర్శించిన ఎమ్మెల్యే
మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. దవాఖానలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు భవన నిర్మాణాలను చేపడుతామన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ అనురాధ, జడ్పీకోఆప్షన్ సభ్యుడు రహమాన్, తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాఘవులు, ఎంపీటీసీ సుధాకర్రెడ్డి, సర్పంచ్లు రమేశ్, రమేశ్యాదవ్, చంద్రయ్య, స్వప్న, కుమార్, ఈశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, ఆరై శ్రీకాంత్, లబ్ధ్దిదారులు పాల్గొన్నారు.