కడ్తాల : బాధిత కుటంబాలను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల మండలంలోని ముద్విన్ గ్రామానికి చెందిన యాదగిరి ఆనారోగ్యానికి గురయ్యారు. వైద్యం కోసం బాధితుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయనరెడ్డిని ఆశ్రయించారు. ఎమ్మెల్సీ బాధితుని కుటుంబ సభ్యుల చేత ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి యాదగిరికి రూ. 51వేల విలువ చెక్కు మంజూరైంది. మంజూరైన చెక్కును శుక్రవారం బాధితుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.