తలకొండపల్లి, నవంబర్ 25 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెడుతున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని దేవకి గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, మండలంలోని వివిద గ్రామాలకు చెందిన 92 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిదులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ లబ్దిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ పేదల ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరంగా మారాయన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమానికి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్, రైతుబీమా, రైతుబంధు, మిషన్ భగీరథతో ఇంటింటి స్వచ్ఛమైన తాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణలాంటి పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 12వేల మందికి కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, ఎంపీడీవో శ్రీకాంత్, ఏఎంసీ డైరెక్టర్ శేఖర్, రమేశ్, సర్పంచులు చంద్రయ్య, రమేశ్, రమేశ్యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
మండలంలోని వెల్జాల్ గ్రామంలోని చెరువుల్లో స్థానిక ముదిరాజ్లతో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ చేపపిల్లలను వదిలారు. ముదిరాజ్ మత్స్యకారుల అభ్యున్నతికి కోసం ప్రభుత్వం 100శాతం ఉచితంగా చేపపిల్లలను ఇస్తుందన్నారు. మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరికి దళితబంధు పథకం ద్వారా మంజూరైన ఆటోమొబైల్ దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం వెల్జాల్ గ్రామంలో టీఎస్ఎస్వో వాల్పోస్టర్లను విడుదల చేసి మొక్కలను నాటారు.
ఆమనగల్లు, నవంబర్ 25 : దళితులు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఖానాపూర్ గ్రామానికి చెందిన బాలుకు దళితబంధు కింద మంజూరైన ఆటోమొబైల్ను, ఆమనగల్లు పట్టణానికి చెందిన వస్పుల రాములుకు మంజూరైన కారును శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులు ఆత్మగౌరవంగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దశల వారీగా దళితులందరికీ దళితబంధు పథకం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఆమనగల్లు మున్సిపాలిటీ ముర్తుజపల్లి గ్రామానికి చెందిన 30 మంది వివిధ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్, వైస్ ఎంపీపీ అనంతరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్రావు, పట్టణ అధ్యక్షుడు పత్యానాయక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నిరంజన్గౌడ్, ఖలీల్, జయరాం, గుత్తి బాలస్వామి, యువజన విభాగం జిల్లా నాయకులు జంతుక కిరణ్, విఠాయిపల్లి రమేశ్, కొమ్ము ప్రసాద్, నాయకులు పూసల భాస్కర్, వెంకటేశ్, రమేశ్, శివకుమార్ పాల్గొన్నారు.