పూడూరు, జనవరి 31 : బాలికలు ఉన్నత చదువులపై దృష్టి పెట్టి పైస్థాయికి ఎదగాలని లయన్స్ క్లబ్ సభ్యుడు నారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పూడూరు మండలం మన్నెగూడ జడ్పీ ఉన్నత పాఠశాలలోని 10 మంది విద్యార్థినులకు సైకిళ్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, ఎంపీపీ మల్లేశం మాట్లాడుతూ.. విద్యార్థినులు చదువుకుంటేనే ఆ కుటుంబం ఎదుగుతుందనిన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా పేద విద్యార్థినులకు సైకిళ్లను అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ వినోద్గౌడ్, క్లబ్ సభ్యులు హరీశ్రెడ్డి, సుందర్రావు, జనార్దన్రెడ్డి, లవకుమార్, ఎంఈవో ఉన్నారు.
ధారూరు : ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో బాగా చదవాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ అన్నారు. మంగళవారం ధారూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో 10 సైకిళ్లను శుభప్రద్పటేల్, ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి కలిసి విద్యార్థినులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శుభప్రద్పటేల్ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నప్పటి నుంచి బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని, పాఠశాలకు, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవ్యా, నాయకులు హన్మంత్రెడ్డి, మోయిజ్ఖురేషీ, యూనుస్, హఫీజ్, యాకుబ్, శ్రీను, సుందర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
నవాబుపేట : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ సంస్థ సోమవారం సైకిళ్లను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యాదయ్య, రాష్ర్ట బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని తోడ్పాటునందిస్తున్న లయన్స్క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు లయన్స్ క్లబ్ గవర్నర్లు మాట్లాడుతూ.. కొంతమంది పాఠశాలకు దూరంనుంచి వస్తున్నారు. వారికి తగిన సౌకర్యం ఉండాలని పదిమంది విద్యార్థులకు సైకిళ్లను అందజేశామన్నారు. విద్యార్థులు తమకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లేనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గవర్నర్లు, జోనల్ ప్రెసిడెంట్, వికారాబాద్ జనరల్ సెక్రటరీ, కో-ఆపరేటివ్ చైర్మన్, సర్పంచ్, హెచ్ఎం ఉన్నారు.