చేవెళ్లటౌన్ : కరోనా సోకి ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ‘ప్లాన్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ’ సభ్యులు అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రతీప్ కుమార్రెడ్డికి స్వచ్ఛంద సంస్థ వారు 5 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎంతోమంది పేద వారు కరోనా సోకి ఆక్సిజన్ అందక చాలా మంది పేద వారు మృతి చెందుతున్నారని పేర్కొన్నారు. కరోనా బారిన పడిన ప్రతి పేషెంట్కి ఈ కాన్సన్ట్రేటర్లు ఉపయోగ పడుతాయని తెలిపారు.