పెంచిన ఫించన్ డబ్బులు చేతికందిన వేళ దివ్యాంగుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. దివ్యాంగులు ఆత్మగౌరవంతో తల్తెత్తుకొని బతికేలా సీఎం కేసీఆర్ మరోసారి పింఛన్ను పెంచిన విషయం తెలిసిందే. రూ.3016 ఉన్న పెన్షన్ను రూ.4016కు పెంచడంతోపాటు ఈ నెల నుంచే అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలోని లబ్ధిదారులకు ఎమ్మెల్యేలు పెంచిన పింఛన్ మంజూరు పత్రాలను బుధవారం అందజేశారు. అనంతరం పింఛన్ డబ్బులకు సంబంధించిన చెక్కులను విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 27,583 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనున్నది. వీరికోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.11.07కోట్లను వెచ్చించనున్నది. పింఛన్ అందజేతపై హర్షం వ్యక్తం చేస్తూ దివ్యాంగులు సంబురాలు చేసుకున్నారు.
రంగారెడ్డి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : అసహాయుల పట్ల ఔదార్యాన్ని చూపి సీఎం కేసీఆర్ పెంచిన రూ.4,016 పింఛన్ రంగారెడ్డి జిల్లాలో బుధవారం అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పెంచిన పింఛన్కు సంబంధించిన మంజూరు పత్రాలను ఎమ్మెల్యేలు దివ్యాంగులకు అందజేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 27,583 మంది దివ్యాంగులు ఉండగా.. పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.11 కోట్లను వెచ్చిస్తున్నది. గతంలో రూ.3,016 ఉన్న ఫించన్ను మరో వెయ్యి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ జీవితాలకు గొప్ప ఆసరా అవుతున్నదని దివ్యాంగులు సంతోషాన్యి వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రం వచ్చిన కొత్తలోనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు రూ.500 ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు చేశారు. తర్వాత కొద్దికాలానికే సాధారణ ఫించన్దారులకు రూ.1,016, దివ్యాంగులకు రూ.1,500లకు పెంచారు. మళ్లీ కొద్దికాలానికే సాధారణ పింఛన్ను రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016లకు పెంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న దీనావస్థను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ గత నెలలో మంచిర్యాల జిల్లాలో జరిగిన బహిరంగ సభలో దివ్యాంగుల పింఛన్ మొత్తాన్ని మరో రూ.వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించారు. వెంటనే ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా సదరం సర్టిఫికెట్ల ఆధారంగా పింఛన్ను ప్రభుత్వం అందజేస్తున్నది. ఆత్మగౌరవంతో బతికేలా పింఛన్ అందిస్తున్నందుకు దివ్యాంగులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత పింఛన్ ఇవ్వడం లేదని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో, గౌరవంగా జీవించేలా ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ఇతోదికంగా చేయూత కల్పిస్తున్నది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అవసరానికి తగినట్లుగా యంత్రాలు, యంత్ర పరికరాలు, వాహనాలు, వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు, వీల్చైర్స్ వంటి వాటిని అందజేస్తున్నది. దివ్యాంగులతో గ్రూపులను ఏర్పాటు చేసి డీఆర్డీఏ ద్వారా రుణ సదుపాయం, ఆసక్తి ఉన్న పనుల్లో ఉపాధి పొందేలా అవకాశాలు కల్పిస్తున్నది. ఉన్నత చదువులు చదివిన దివ్యాంగులు ఉద్యోగాల్లో చేరేందుకు రిజర్వేషన్ల కల్పనతోపాటు, రైళ్లు, బస్సుల్లో ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నది. గృహలక్ష్మి పథకంలోనూ దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ను అమలు చేస్తున్నది. ఇలా..ప్రభుత్వ సహకారంతో దివ్యాంగులు స్వయం ఉపాధితో కుటుంబాలను పోషించుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. మెదక్లో సీఎం కేసీఆర్ పెంచిన దివ్యాంగుల పింఛన్ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలో చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గ కేంద్రాల్లో, అమనగల్లులో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, జైపాల్ యాదవ్ పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గురువారం పింఛన్ పత్రాలను దివ్యాంగులకు అందజేయనున్నారు.
దివ్యాంగుల పింఛన్ పెంపు హర్షించదగ్గ విషయం. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సమ దృష్టితో కృషి చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేయూతనిస్తున్నారు. దివ్యాంగులు సీఎం కేసీఆర్ను గుర్తుపెట్టుకుంటారు. దివ్యాంగుల కష్టాలు తెలిసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాలు 500 ఇస్తే.. దివ్యాంగులకు ఈ డబ్బులు సరిపోవని సీఎం కేసీఆర్ మొదట్లో 1000 రూపాయలకు పెంచి ఆ తరువాత 3016 రూపాయలకు పెంచారు. రూ.4016 పింఛన్ అందస్తున్న కేసీఆర్కు దివ్యాంగుల తరఫున ధన్యవాదాలు.
– సాలె శ్రీనివాస్, దేవునిఎర్రవల్లి గ్రామం,
దివ్యాంగులకు రూ.4016 ఫించన్ పెంచినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా దివ్యాంగుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఫించన్ గతంలో 3016 ఉండేది. దివ్యాంగుల బాధలను అర్థం చేసుకుని మరో రూ.1000 పెంచడం ఎంతో సంతోషకరం. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా.
– గణేశ్, శంకర్పల్లి
నాకు కాంగ్రెస్ సర్కారులో రెండువందలు పింఛన్ ఇచ్చేవారు. అవి దేనికీ సరిపోయేవికావు. నేను నడువలేని స్థితిలో ఉన్నాను. తెలంగాణ వచ్చినంక ముఖ్యమంత్రి సారు 3016 పింఛన్ ఇచ్చారు. సీఎం సారు రూ.4016 పింఛన్ ఇస్తామని ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది. సారుకు ప్రత్యేక దండాలు. ఈ డబ్బుతో నా కుటుంబం ఎలాంటి చీకూచింత లేకుండా కొనసాగుతుంది.
– సాలమ్మ, ఇబ్రహీంపట్నం
సీఎం కేసీఆర్ మా దివ్యాంగుల పాలిట దేవుడు. మమ్ములను గత ఏ ప్రభుత్వాలూ పట్టించుకున్న పాపాన పోలేదు. మా పట్ల ఇంత ప్రేమ చూపుతున్న సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని నా కోరిక. మమ్మల్ని అర్థం చేసుకుని మాకు మూడు పూటలా బువ్వ తినేలా చేసిన కేసీఆర్ సారును మరువం.
– మోత్యా, బాలాజీనగర్ తండా
సీఎం కేసీఆర్ ఆసరా పెన్షన్ లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. మా బాబు దివ్యాంగుడిగా పుట్టడంతో మేము చాలా బాధపడ్డం. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మొదట రూ.3016 ఉన్న పింఛన్ను ప్రస్తుతం రూ.4016లకు పెంచడంతో మా బాబుకు ఆసరాగా నిలిచింది. దీంతో బాబుకు సరిపడు పౌష్టికాహరం ఇతర ఖర్చులకు ఎంతో ఆసరా ఆవుతున్నది. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– దివ్యాంగుడు కేతావత్ గణేశ్ తల్లి
దివ్యాంగుల కష్టాలు తెలిసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కావడం ఎంతో గర్వకారణం. ఆయన ఎంతో గొప్ప మససుతో రూ.4016 పింఛన్ అందించి ఆదుకుంటున్నారు. ఆయనకు ఏంచేసినా రుణం తీర్చుకోలేనిది. గత సీమాంధ్ర పాలనలో ఏమాత్రం పట్టించుకోలేదు. కాని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.3016 అందింది. ఇప్పుడు పింఛన్ను రూ.4016లకు పెంచి ఆదుకోవడం పట్టరాని సంతోషంగా ఉన్నది. అన్ని వర్గాలతో పాటు దివ్యాంగులను ఆదుకుంటున్న గొప్ప మనసున్న నాయకుడు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– ముక్కెర నారాయణ, ఇబ్రహీంపట్నంరూరల్
దివ్యాంగుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా ఇప్పటికే ప్రతి నెలా రూ.3016 ఇచ్చి ఆదుకుంటున్నది. అదనంగా మరో రూ.1000 పెంచి ప్రభుత్వం అండగా ఉండడం సంతోషంగా ఉంది. మాలాంటి ఎంతో మంది దివ్యాంగులకు సర్కార్ అందిస్తున్న పింఛన్లతో నెలంతా ఎంతో అసరా అవుతున్నది. సమైక్య రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా దివ్యాంగులను పట్టించుకున్న పాపానపోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 500 పింఛన్ను రూ.4016లకు పెంచి మా కాళ్లమీద మేమే నిలబడేలా చేసినందుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– నవాబ్, దివ్యాంగుడు, చేవెళ్ల గ్రామం
దివ్యాంగుల సంక్షేమాన్ని గతంలో ఏ ప్రభుత్వాలూ పట్టించుకున్న పాపానపోలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు రూ.4016 పింఛన్ అందజేసి అండగా నిలుస్తున్నారు. గతంలో దివ్యాంగులకు రూ.500 పింఛన్ అందిస్తే అవి ఏమాత్రమూ సరిపోయేవికావు. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ 4016 అందిస్తుండటంతో మాలాంటి ఎంతోమంది దివ్యాంగులకు సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
– జంగయ్య, దివ్యాంగుల సంఘం నాయకుడు, ఇబ్రహీంపట్నం