నగర శివారులోని కీలకమైన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. మున్సిపల్ చట్టం ప్రకారం నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే మేయర్పై అవిశ్వాసానికి అవకాశం ఉండటంతో పలు చోట్ల కౌన్సిలర్లు ప్రస్తుత మేయర్లపై తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు అన్ని స్థానిక సంస్థల్లో ఈ నెలాఖరుకు నాలుగు సంవత్సరాలు పూర్తి కానుండటంతో అవిశ్వాసానికి పావులు కదులుతున్నాయి.
ఇందులో భాగంగా శివారులోని కీలకమైన బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుత మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డిపై సొంత పార్టీతో పాటు ఇతర పార్టీల కౌన్సిలర్లు కూడా గుర్రుగా ఉన్నారు. అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాల దరిమిలా త్వరలోనే అవిశ్వాస తీర్మానం తెరపైకి వచ్చే అవకాశముంది. దీంతో పాటు ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట మున్సిపాలిటీల్లోనూ ప్రస్తుత చైర్పర్సన్లపై అవిశ్వాసానికి కౌన్సిలర్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 4 (నమస్తే తెలంగాణ)
హైదరాబాద్ నగర శివారులోని కీలకమైన మున్సిపల్ కా ర్పొరేషన్, మున్సిపాలిటీల్లో అవిశ్వాస ఘంటికలు మోగుతున్నాయి. మున్సిపల్ చట్టం ప్రకారం నాలుగేండ్లు పూర్తైన తర్వాతే మేయర్పై అవిశ్వాసానికి అవకాశం ఉండడంతో ప్రస్తుతం పలుచోట్ల కౌన్సిలర్లు ప్రస్తుత మేయర్లపై తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు అన్ని స్థానిక సంస్థల్లోనూ ఈ నెలాఖరుకు నాలుగేండ్లు పూర్తి కానుండడంతో అవిశ్వాసానికి పావులు కదులుతున్నారు. ఇందులో భాగంగా శివారులోని కీలకమైన బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుత మేయర్ చిగురిం త పారిజాతానర్సింహారెడ్డిపై సొంత పార్టీతోపాటు ఇతర పార్టీల కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. దీంతో అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామా ల దరిమిలా త్వరలోనే తెరపైకి అవిశ్వాస తీర్మానం వచ్చే అవకాశముంది. దీంతోపాటు ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట మున్సిపాలిటీల్లోనూ ప్రస్తుత చైర్పర్సన్లపై అవిశ్వాసానికి కౌన్సిలర్లు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
-సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 4 (నమస్తే తెలంగాణ)
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట మున్సిపల్ కా ర్పొరేషన్ అటు విస్తీర్ణంలోనూ ఇటు ఆదాయంలోనూ పెద్దదే. ఇంతటి కీలకమైన కార్పొరేషన్లో ప్రస్తుతం చిగురింత పారిజాత మేయర్గా ఉన్నారు. కార్పొరేషన్ పరిధిలో 32 వార్డులుండగా..ఇందులో 14 స్థానాలను బీఆర్ఎస్ సొంతం చేసుకున్నది. బీజేపీ పది స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ ఏడు స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చిగురింత పారిజాత బీఆర్ఎస్లోకి రావడంతో ఆమెకు మేయర్ పదవి దక్కింది. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల దరిమిలా తిరిగి ఆమె కాం గ్రెస్లో చేరింది. దీంతోపాటు ఆమె ఏకపక్ష ధోరణితో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లతోపాటు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సైతం గుర్రుగా ఉన్నారు.
మేయర్పై అసంతృప్తి దావనంలా వ్యాపిస్తుండటంతో అవిశ్వాస తీర్మానానికి బీజం పడింది. బీఆర్ఎస్కు చెందిన 14 మంది కార్పొరేటర్లు ఇందుకు సిద్ధమవుతుండగా… బీజేపీకి చెందిన 10 మంది కార్పొరేటర్లు కూడా ఇటీవల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆమెను మేయర్ పీఠం నుంచి దింపాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కొన్నిరోజులుగా మేయర్ అధికారులపై దురుసుగా వ్యవహరిస్తుండటం, తమ పార్టీ అధికారంలో ఉన్నందున తాను చెప్పినట్లుగానే నడవాలం టూ ఇష్టానుసారంగా అధికారులతో మాట్లాడుతుండటం కూ డా అనేకమంది కార్పొరేటర్లకు నచ్చడం లేదని సమాచారం.
దీంతోపాటు కాంగ్రెస్కు చెందిన పలువురు కార్పొరేటర్లు కూ డా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన ఆమె…కొన్నిరోజులుగా ఎమ్మెల్సీ తనకే వస్తుందంటూ ప్రచా రం చేసుకుంటున్నారు. ఇదేకాకుండా చేవెళ్ల ఎంపీ సీటు కూ డా తనకే వస్తుందంటూ వ్యాఖ్యానిస్తుండటం కాంగ్రెస్ పార్టీ వర్గాలకు నచ్చడం లేదు. ప్రతి అంశంలోనూ తనకే అవకాశం ఇవ్వాలంటే.. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న తాము ఏం కావాలంటూ కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మేయర్ పీఠంకోసం ఎంత ఖర్తైనా.. ఆమెను పదవి నుంచి దింపేందుకు కొందరు కాంగ్రెస్ కార్పొరేటర్లు పావులు కదుపుతున్నారు. ఎలాగూ బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు కూడా అదే ప్రయత్నంలో ఉన్నందున ఇక్కడ అవిశ్వాసం అవివార్యమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
పెద్దఅంబర్పేట మున్సిపల్ రాజకీయం కూడా ప్రస్తుతం రసవత్తరంగా మారింది. ఇక్కడ 24 వార్డులుండగా… ఇందులో బీఆర్ఎస్ 8 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ అత్యధికంగా 13 స్థానాలను గెలుచుకున్నది. బీజేపీ, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు చెరో స్థానంలో విజ యం సాధించారు. అయినప్పటికీ కాంగ్రెస్లోని కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోవడం బీఆర్ఎస్కు కలిసొచ్చింది. చైర్పర్సన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించినందున వైస్ చైర్మన్ పదవికోసం కాంగ్రెస్ పార్టీలోని కౌన్సిలర్ల మధ్య పోటీ నెలకొన్నది. ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మేనల్లుడు మురళీధర్రెడ్డికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని అప్పట్లో కోమటిరెడ్డి పట్టుబట్టగా.. దీనికి వ్యతిరేకంగా విజయశేఖర్రెడ్డి వర్గం బీఆర్ఎస్కు మద్దతు తెలిపింది.
దీంతో బీఆర్ఎస్కు చెందిన చెవుల స్వప్నకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కూడా కలిసి రావడంతో చైర్పర్సన్ పీఠం దక్కిం ది. వైస్ చైర్పర్సన్గా విజయశేఖర్రెడ్డి భార్య సంపూర్ణ అయ్యారు. అనంతరం కొద్దికాలానికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్పై అసంతృప్తి నెలకొని.. గతేడాదే అవిశ్వాసానికి కలెక్టర్కు నోటీసు ఇచ్చారు. కానీ నిబంధనల ప్రకారం నాలుగేండ్లు కాకపోవడంతో అది అమలులోకి రాలేదు.
అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు చెందిన చైర్పర్సన్ స్వప్న మరో బీఆర్ఎస్ కౌన్సిలర్తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎలా గో విభేదాలు ఉన్నందున… గతంలో వైస్చైర్మన్ పదవిఆశించి, భంగపడిన మురళీధర్రెడ్డి మరోసారి పావులు కదప డం మొదలుపెట్టా రు. చైర్పర్సన్ పదవిని తనకు అనుకూలంగా ఉన్న పండుగ ల జయశ్రీకి ఇచ్చి, తాను వైస్ చైర్మన్ కావాలని ఆశిస్తున్నారు. దీంతో ఈ నెల 25తో నాలుగేండ్లు పూర్తి కాగానే అవిశ్వాసానికి రంగం సిద్ధం చేశారు. అయితే దీనిని అడ్డుకునేందుకు విజయశేఖర్రెడ్డి వర్గం కూడా సిద్ధమైంది. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతిపైనా అవిశ్వాసానికి రంగం సిద్ధమైనది. గతంలోనే కలెక్టర్కు నోటీ సు ఇచ్చినప్పటికీ నిబంధనల ప్రకారం నాలుగేండ్లు పూర్తి కా నుందున అవిశ్వాసానికి అవకాశం లేకుండా పోయింది. దీం తో నాలుగేండ్లు పూర్తైన వెంటనే అవిశ్వాస మేఘాలు కమ్ముకోనున్నాయి. ఇక్కడ మొత్తం 24 వార్డులుండగా… బీఆర్ఎస్ 16 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. రెండు స్థానాలను బీజేపీ దక్కించుకోగా… ఆరు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిం ది.
సంపూర్ణ బలం ఉండటంతో బీఆర్ఎస్కు చెందిన కప్పరి స్రవంతిని చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. అయితే ఇటీవల ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో పూర్తిస్థాయి బలము న్న బీఆర్ఎస్ అవిశ్వాసానికి రంగం సిద్ధం చేసింది. ఈ విష యం ముందుగా తెలియడంతోనే ఆమె ఇటీవల ఇబ్రహీం పట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో స్రవంతి పార్టీ మారడం, గతంలోనే ఆమెపై కౌన్సిలర్లలో పెద్ద ఎత్తున అసంతృప్తి ఉండటం, తాజా కేసు నేపథ్యంలో ఆమె చైర్పర్సన్ పద వి పోవడం వందశాతం ఖాయమైందని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.